మహబూబ్నగర్ టౌన్, జూలై 27 : పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5వ సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్సుల్లో 25,430 మంది విద్యార్థులు ఉన్నారు. 2వ సెమిస్టర్లో 13,217, మూడో సెమిస్టర్లో 10,755, ఐదో సెమిస్టర్లో 1,458 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
49 డిగ్రీ కళాశాల సెంటర్లలో ఏర్పా ట్లు పూర్తి చేశారు. సిట్టింగ్, ప్లెయింగ్ స్క్వాడ్లు పరీక్షల నిర్వహణను పరిశీలించనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహిస్తామని, విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని పీయూ పరీక్షల నియంత్రణ అధికారి డా.రాజ్కుమార్ తెలిపారు.