జడ్చర్లటౌన్, అక్టోబర్19 : దసరా దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని లలితాదేవీమాతగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలతో వచ్చి ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ ఆడారు. అదేవిధంగా విద్యానగర్కాలనీలోని సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని లక్ష్మీదేవి మాతగా ఆలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. చైతన్యనగర్కాలనీ, పాతబజార్, గౌరిశంకర్కాలనీ, వెంకటేశ్వరకాలనీ, శ్రీనివాస్నగర్కాలనీ, హౌసింగ్బోర్డుకాలనీల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
బాలానగర్, అక్టోబర్ 19 : మండలంలోని గంగాదర్పల్లిలో కొలువుదీరిన అమ్మవారు గురువారం భక్తులకు మహాచండి అమ్మవారుగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి దుర్గామాత మాలధారులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు తిరుపతయ్య, శ్రీను, భక్తులు ఉన్నారు.
మిడ్జిల్, అక్టోబర్ 19 : దేవీనవరాత్రి ఉత్సవాలు మండల కేంద్రంతోపాటు మల్లాపూర్, వేముల, వాడ్యాల్, దోనూర్ గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలోని ఈదమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. మహాచండీదేవి అవతారంలో అలకరించి నైవేద్యం సమర్పించారు. మహిళలు కుంకమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో అలయ కమిటీ అధ్యక్షుడు శంకర్, సర్పంచులు జంగిరెడ్డి, రాధిక, మంగమ్మ, నాయకులు బాల్రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాసులు, విజయ్కుమార్, గంజి శేఖర్, కుమార్, రామకృష్ణ, రాఘవేందర్, భాస్కరాచారి, మల్లయ్య, శంకర్ఆచారి, యాదయ్య, గోపాల్, జంగయ్య, మల్లాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు బంగారు, సత్యం తదితరులు ఉన్నారు.
నవాబ్పేట, అక్టోబర్ 19 : మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారు ధనలక్ష్మీదేవీగా గురువారం దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆర్యవైశ్యులు, మహిళలు, భక్తులు పెద్దఎత్తున పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నా రు. కారుకొండ, ఫత్తేపూర్ మైసమ్మ ఆలయాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాతకు భక్తులు పెద్దఎత్తున పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆ ర్యవైశ్య సంఘం నాయకులు ఆంజనేయులుగుప్తా, అశోక్, బి.శ్రీరాము లు, రామకృష్ణ, బాలరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.