కొల్లాపూర్, మార్చి 11 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో గ్యాస్ కోసం గంటల తరబడి కస్టమర్లు నిరీక్షిస్తున్నారు. ఇంతకుముందు సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకున్న ఒకటి, రెండ్రోజుల్లో డెలివరీ అయ్యేవి.. కానీ కొన్ని రోజులుగా బుక్ చేసుకున్నా రావడం లేదంటూ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం పట్టణ ంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని గంటల తరబడి క్యూలో ని లబడ్డారు. బారులు తీరిన కస్టమర్లను చూసి తనకు సిలిండర్ వస్తుందో? రాదో? అన్న బెంగతో 70 ఏండ్ల వృద్ధురాలు నారాయణమ్మ కిందపడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. మరో మహిళ చంటి పిల్లవాడితో ఎర్రని ఎండలో నిలబడింది. మంత్రి జూపల్లి ఇలాకాలో గ్యాస్ కోసం ఇబ్బందులు పడ్తుంటే పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపించారు.
బుక్ చేసుకున్న వారికి సిలిండర్లు ఇప్పటికే డెలివరీ చేశామని ఏజెన్సీ డీలర్, సిబ్బంది చెప్పడంతో కస్టమర్లు షాక్కు గురయ్యారు. మాకు సిలిండర్లే రాలేదంటూ పలువురు వారిని నిలదీయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఏజెన్సీ డీలర్ను వివరణ కోరగా.. రోజు విడిచి రోజు కొల్లాపూర్కు 342 గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయని, మొత్తం 18 వేల కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. బయట మార్కెట్లోకి ఎలా వెళ్లాయో తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు.