మూసాపేట, మార్చి 29 : రోజురోజుకూ ఎండలు పెరుగుతుండడంతో చెరువులు, వాగులు ఎండిపోయాయి. బోరుబావుల్లో సైతం భూగర్భజలాలు అడుగంటాయి. ఆరుగాలం కష్టించి పండించిన పం టలు చేతికొచ్చే సమయంలో ఎండిపోతుండడంతో రైతన్నకు గుండెకోత మిగులుతున్నది. అడ్డాకుల మం డలం తిమ్మాయిపల్లి తండాలో చేతికొచ్చిన వరి పం టలు సాగునీళ్లు అందక నెర్రెలుబారుతున్నాయి. తం డాకు చెందిన రైతు మన్యంకు నాలుగెకరాల భూమి ఉన్నది. అందులో నాలుగు బోర్లు ఉండగా మూడెకరాల్లో వరి సాగు చేశాడు. 15 రోజుల్లో పంట చేతికి రానుండగా బోర్ల నుంచి నీళ్లు రాక కండ్లముందే ఎండిపోతుంటే చూడలేక రెండెకరాల పంటను పశువుల మేతకు వదిలేశాడు. మిగిలిన ఎకరాకు రాత్రీపగలు తేడా లేకుండా నీళ్లు పారబెడుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు శంకర్నాయక్కు నా లుగెకరాల భూమి ఉన్నది. అతనికి రెండు బోర్లు ఉండగా రెండెకరాల్లో వరి పంట సాగు చేశాడు. కాగా రెండు బోర్లలో జలం అడుగంటి సన్నగా ఆగి ఆగి పోస్తుండడంతో పారిన మడే పారుతున్నది. దీంతో ఎకరం పంట ఎండిపోయింది. రెండు బోర్లనుంచి నీరు పారించినా పొలానికి పారడం లేద ని రైతు అవేదన వ్యక్తం చేస్తున్నాడు. 15 రోజులైతే పంట చేతికొచ్చేదని వాపోతున్నాడు.
అడుగంటిన ఆశలు..
యాసంగిలో వరి పంటలకు నీళ్లులేక నెర్రెలుబారి ఎండిపోతున్నాయి. గతేడాది యాసంగిలో నీళ్లు పు ష్కలంగా ఉండటంతో పంటలు బాగా పం డాయి కానీ.. ఈ ఏడాది వానకాలంలో వర్షాలు అంతంతమాత్రంగానే కురవడం తో చెరువుల్లోకి నీరు చేరలేదు. భూగర్భజలాలు అడుగంటిపోయి బోరుబావుల్లోంచి నీరు రావడం లేదు. దీంతో వేసిన వరి పై ర్లు ఎండిపోతున్నాయి. యాసంగి ప్రారంభంలో బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉండడంతో రైతులు అధిక మొత్తంలో వరి సాగు చేశారు. తీరా కలుపు తీసే సమయానికి నీ ళ్లు తగ్గి పంటలు పూర్తిగా ఎండిపోయే దశ కు చేరుకున్నాయి. పంట చేతికొచ్చేందుకు ఇంకా రెండునెలల సమయం ఉండడంతో ఆశలు అడుగంటాయి.
వరి పైర్లకు నీరందక కండ్లముందే నెర్రెలుబారి ఎండుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగు ఖర్చులు తడిసి మోపెడయ్యాయని, అప్పులు తెచ్చి సాగు చేసిన పం టలు మధ్యలోనే ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో వాటిని పశువులకు మేపుతున్నారు. వరి సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రై తులు కోరుతున్నారు.
చి‘వరి’ దశలో నీరందడం లేదు..
చంద్రబాబు పాలనలో పంటలు ఇట్లే ఎండిపో యి పూర్తిగా నష్టపోయాం. మళ్లీ ఇప్పుడు పంటకు తడి కోసం తండ్లాడుతున్నం. కేసీఆర్ పాలనలో గ త ఎండాకాలంలోనే ఇప్పుడున్న రెండు బోర్లతో నాలుగెకరాలు పండించిన. కానీ ఇప్పుడు రెండెకరాలు సాగు చేస్తేనే చివరి దశలో ఎకరానికి నీరు అందక ఎండిపోయింది. మిగిలిన ఎకరానికి తడి పెట్టడానికి రాత్రీపగలు ఇక్కడే పడిగాపులు కా స్తున్నా. ఎండిన పంటకు ప్రభుత్వం నష్టపరిహార మిచ్చి ఆదుకోవాలి. లేదంటే రైతాంగం ఆగమైతది.
– శంకర్నాయక్, రైతు, తిమ్మాయిపల్లితండా, అడ్డాకుల మండలం