ఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇటీవలే జపాన్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి రుణపడి ఉంటానని తెలిపింది. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు కోహ్లీని సాయం కోరానని, అతడిచ్చిన సలహాలు తనకెంతగానో ఉపయోగపడ్డాయని ఆమె పేర్కొంది. ఎక్స్ వేదికగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు స్పందిస్తూ.. ‘విరాట్ భాయ్కు నేనెప్పుడూ రుణపడి ఉంటా.
గాయాలతో సతమతమవుతూ, ఫామ్ కోల్పోయి నా కెరీర్ క్షీణ దశలో ఉన్నప్పుడు నా సమస్యను అర్ధం చేసుకుని సాయం చేసే వ్యక్తి కోసం చూశా. అప్పుడే కోహ్లీని సంప్రదించా. అతడు క్షణాల్లోనే స్పందించాడు. ఆ తర్వాతి రోజే మేం కలుసుకున్నాం. మా ఇద్దరి నడుమ జరిగిన సంభాషణ ఎప్పటికీ మా మధ్యే ఉంటుంది. కానీ ఆ సమయంలో కోహ్లీ చెప్పిన సలహాలు మాత్రం నాకు, నా కెరీర్కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వాస్తవానికి ఆయన ఎక్కువేం మాట్లాడలేదు. కానీ నాకు, నా భర్తకు చెప్పిన ప్రతి మాట మా మదిలో నిలిచిపోయింది. కొంతమందితో స్నేహం, వారితో సంభాషణ మన ఆలోచణ ధోరణిని మార్చేస్తాయి. అలాంటి వాటిలో ఇదొకటి..’ అని సింధు చెప్పుకొచ్చింది.