చాంగ్జౌ (చైనా): చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలిరోజు భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. మొదటి రోజు బరిలోకి దిగిన హెచ్ఎస్ ప్రణయ్తో పాటు మహిళల సింగిల్స్లో దేవికా సిహాగ్ ఫస్ట్ రౌండ్కే ఇంటిబాట పట్టారు. మెన్స్ సింగిల్స్లో ప్రణయ్.. 10-21, 14-21తో లియొంగ్ జున్ (మలేషియా) చేతిలో పరాజయం పాలవగా, సిహాగ్.. 19-21, 21-19, 13-21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో పోరాడి ఓడింది.