గద్వాల, ఫిబ్రవరి 21 : వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో ఈ ఏ డాది జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండలేదు. దీనికితోడు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి కూడా నీరు రాకపోవడంతో యాసంగి సీజన్లో జూరాల ప్రాజెక్టు కింద అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. వాస్తవంగా జూరాల కుడి కాల్వ ద్వారా 35,657 ఎకరాలు, ఎడుమ కాల్వ ద్వారా 69,084 ఎకరాలకు సాగునీరు అం దించాల్సి ఉన్నా.. ఏనాడూ పూర్తి స్థాయి ఆ యకట్టుకు నీరు అందలేదు. వానకాలం సీ జన్లో జూరాల కుడి కాల్వ కింద 29, 592 ఎకరాలకు సాగునీరు విడుదల చే శారు. ప్రస్తుతం జూరాలలో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే స రిపోతుండడంతో యాసంగికి నీరు నిలిపివేశారు. జూరాల నీటి సా మర్థ్యం 9.657 టీఎంసీలు కా గా ప్రస్తుతం 0.808 టీఎంసీలు మాత్రమే ఉన్నది. దీనిపై ఆధారపడ్డ నెట్టెంపాడు ప్రా జెక్టు కింద 1.42 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా ర్యాలంపాడ్ రిజర్వాయర్కు బుంగలు పడడంతో నాలుగు టీఎంసీలు నింపాల్సిన చోట కేవలం 1.5 టీఎంసీలను మాత్రమే నింపారు. ఈ ఏడాది అందులో కూడా నీటి నిల్వ లేకపోవడంతో కేవలం ఐదు వేల ఎకరాల సాగుకు మాత్రమే అధికారులు ప్రతిపాదనలు పంపారు. గత వానకాలం సీజన్లో నెట్టెంపాడ్ ప్రాజెక్టు కింద 1,12,925 ఎకరాలకు సాగు నీరందించారు. ప్రస్తుతం బోరు బావుల కింద మాత్రమే రైతులు పం టలు సాగు చేశారు. మిగతా పొలాలన్నీ బీడు గా దర్శనమిస్తున్నాయి. జూరాల కాల్వలో నీ రు తగ్గిపోవడంతో మిరప, ఆలసంద పంటలు కూడా పూర్తిగా ఎండిపోయాయి.
ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద వాస్తవంగా 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉండ గా.. 31,900 ఎకరాలకు మించి ఎన్నడూ సా గునీరు అందలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరు అందించాలనే ఆలోచనతో ముందడుగు వేశారు. డీ-24 నుంచి డీ-40 వరకు ఉన్న 55,600 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 2018 నుంచి సాగునీరు అందించారు. గత వానకాలం సీజన్లో తుమ్మిళ్ల లిఫ్ట్ కింద 35,997 ఎకరాలు సాగయ్యాయి. ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో ఆర్డీఎస్ ప్రాజెక్టు ఎండిపోవడం, తుంగభద్ర డ్యాంలో నీరు లేకపోవడంతో ఆర్డీఎస్, తుమ్మిళ్ల ప్రాజెక్టుల కింద కూడా అధికారులు క్రాప్హాలిడే ప్రకటించారు. ఆర్డీఎస్ కాల్వకు గతేడాది మార్చి చివరి నాటికి నీరు విడుదలయ్యాయి. అయితే, ఈ ఏడాది ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో రెండు నెలలుగా కాల్వలకు నీటిని బంద్ చేశారు. దీం తో ఆర్డీఎస్ కింద రైతులు సాగు చేసిన పంటలు నీరు అందక ఎండిపోయాయి. బోరుబావుల కింద తప్పా ఎక్కడ చూసినా బీ డు భూములే దర్శనమిస్తున్నాయి.