Online Betting | నాగర్కర్నూల్,(నమస్తే తెలంగాణ) : ఐపీఎల్.. యువతలో ఉత్సాహాన్ని నింపుతున్నది. ఒకవైపు వేసవిలో ఆహ్లాదాన్ని పంచుతు న్నా.. మరోవైపు బెట్టింగ్తో విషాదాన్నీ విస్తరిస్తున్న ది. ఇంతకుముందు ఇండియా, పాకిస్తాన్ టీంలతోపా టు ఇతర దేశాలతో జరిగే పోటీలపై బెట్టింగులు జరుగుతుండేవి. అవి కూడా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వం టి పెద్ద పట్టణాలకే పరిమితమయ్యేది. ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా.. అని గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది. దీంతో యువత బలవుతున్నారు. మ్యాచ్ పరిస్థితులను బట్టి, బంతి బంతికీ మారే ఫలితాలను బట్టి అప్పటికప్పుడు బెట్టింగ్లో రేటు ఉంటుంది. ఓడిపోయే స్థితిలో ఉన్న జట్టు గెలిస్తుందంటే ఓ రేటు, 50 రన్స్ ఎవరు చేస్తారు..?, ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు? మ్యాచ్ను ఎవ రు గెలిపిస్తారు? ఇలా ఒక్కో అంశాన్ని బట్టి ఓ రేట్ను నిర్ణయిస్తారు. ఈ బెట్టింగ్ ప్రస్తుతం ఆన్లైన్లో విస్తృతంగా జరుగుతున్నది.
హైదరాబాద్ వంటి ప్రాంతాలకు చెందిన మాఫియా ఇక్కడి యువతను ఈ రొంపిలోకి దించుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇక్కడి బెట్టింగ్ రాయుళ్లు కొత్త వాళ్లను సైతం ఇందులో చేరేలా ప్రోత్సహిస్తుంటారు. ఈ గ్రూపుల్లో మ్యాచ్ పరిస్థితులను బట్టి బెట్టింగ్ కాస్తుంటారు. ఇలా బెట్టింగ్ కాసిన పలువురు యువకులు రూ.లక్షల్లో సైతం నష్టపోయిన దాఖలాలు ఉన్నా యి. దీని ద్వారా వినోదాన్ని పంచే ఐపీఎల్.. కొన్ని కుటుంబాల్లో విషాదాలను నింపుతున్నాయి. టీనేజ్ నుం చి, క్రికెట్ ఆడే యువకులు, అవగాహన ఉన్న చాలా మంది బెట్టింగులకు పాల్పడుతూ ఇండ్లల్లోనూ తగాదాలకు కారణమవుతున్నారు. చర్యలు తీసుకోవడానికి తగిన ఆధారాలు లేకపోవడం, ఫిర్యాదులు రాకపోవడం వంటి కారణాలతో పోలీసులు సైతం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
ఈ బెట్టింగ్ రాయుళ్లు పరిమిత సంఖ్యలో ఉండటం, గోప్యంగా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తుండడంతో చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. బెట్టింగ్పై సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నా స్పందన రావడం లేదు. ఎక్కడైనా బెట్టింగ్ డబ్బుల విషయంలో యువకుల మధ్య గొడవలు జరిగితేనే పోలీసుల వద్దకు వెళ్తున్నాయి. అప్పుడే ఈ ఘటనలు బయటకు వస్తున్నాయి. అయితే, యువత మాత్రం బెట్టింగ్ జోరుతో రూ.వేలల్లో డబ్బులను పోగొట్టుకుంటున్నది. ఐపీఎల్ ము గిసే వరకూ యువత బెట్టింగ్ జూదంలోనే మునిగి తేలుతున్నారు. పట్టణాల్లోని క్రీడా మైదానాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో బెట్టింగ్ను నిర్వహిస్తున్నారు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటే బెట్టింగ్ను అరికట్టే అవకాశం ఉన్నది.