మహబూబ్నగర్ : జిల్లా కేంద్రం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సంజయ్ నగర్లో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక టూ టౌన్ ఎస్.హెచ్.ఓ. సోం నారాయణ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలలో సుమారు మూడు వందల ఇండ్లలోని సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజల భద్రత, శాంతిని కాపాడే నేపథ్యంలో జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసులు నమోదు చేయగా.. సరైన పత్రాలు లేని (26) ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసు అధికారులు జప్తు చేశారు. ఈ తనిఖీలలోఎనిమిది మంది ఎస్.ఐ.లు, 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.