మక్తల్టౌన్, సెప్టెంబర్ 11: మక్తల్ నియోజకవర్గం అభివృద్ధే అభిమతంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిరంతర శ్రామికుడిగా ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 150పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆర్థికశాఖ అనుమతులు మంజూరు చేయించారు. ఈనెల 13న(బుధవారం) ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును ఆహ్వానించి ఆస్పత్రి నిర్మాణానికి అంకురార్పణ చేయించనున్నారు. మక్తల్ పట్టణానికి సమీపంలోని ప్రభుత్వ సర్వేనెంబర్ 919లో ఐదెకారల స్థలంలో రూ.35కోట్లతో అద్భుతమైన ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభాలు చేయనున్నారు.
– మక్తల్ వ్యవసాయ మార్కెట్లో రూ.70లక్షలతో నిర్మించిన జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాన్ని ప్రారంభించనున్నారు.
– మక్తల్ పట్టణంలో రూ.2కోట్ల50లక్షలతో ఫైర్స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.
– మక్తల్ మున్సిపాలిటీలోని ట్యాంక్బండ్ వద్ద రూ.20లక్షలతో నిర్మించిన వెల్కమ్ టు మక్తల్ మున్సిపాలిటీ బోర్డును ప్రారంభించనున్నారు.
– రుద్రసముద్రంలో రూ.6కోట్లతో నిర్మించిన రెండు హెయిర్హౌస్ గోదాంలను ప్రారంభించనున్నారు.
– గుడిగండ్లలో రూ.కోటి50లక్షలతో 33/11కేవీ కర్నిలో రూ.కోటి50లక్షలతో నిర్మించిన 33/11కేవీ సబ్స్టేషన్లను మంత్రి ప్రారంభించనున్నారు.
– కృష్ణ మండల కేంద్రంలో రూ.కోటి20లక్షలతో పీహెచ్సీ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.
– కృష్ణ మండలంలోని హిందూపూర్ వద్ద రూ.2కోట్ల50లక్షలతో నిర్మించిన కేజీబీవీ భవాన్ని ప్రారంభించనున్నారు.
– ఊట్కూర్ మండలం పులిమామిడిలో రూ.కోటి70లక్షలతో నిర్మించిన కేజీబీవీ కళాశాల భవనం, నర్వ మండలకేంద్రంలో రూ.5కోట్లతో నిర్మించిన పాఠశాల, కళాశాల భవనాలు ప్రారంభించనున్నారు.
మక్తల్ మండలంలోని గుడిగండ్ల, జౌలాపురం, మాదన్పల్లి, బుడ్డెగాన్తండా, కర్ని, ఎర్సన్పల్లి, చిట్యాల, పంచలింగాల, చిన్నగోప్లాపూర్కు కరెంట్ కష్టాలు తీరనున్నాయి. అలాగే ఫైర్స్టేషన్ నిర్మించడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సంభవించే అగ్నిప్రమాదాలను నివారించేందుకు దోహదపడనుంది. మూడు మండలాల్లో నూతన భవనాలు అందుబాటులోకి రావడంతో విద్యార్థినుల చదువులకు ఆటంకాలు తొలగనున్నాయి.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి రూ.50కోట్లకుపైగా అభివృద్ధి పనులు చేయడంతో నియోజకవర్గ ప్రజలంతా రామన్న వెంటే ఉంటామంటూ.. వచ్చే ఎన్నికల్లో మరోసారి మక్తల్ అభివృద్ధి ప్రదాతను భారీ మెజార్టీతో గెలిపించుకొని సీఎం కేసీఆర్కు విజయబావుటాను బహుమతిగా అందించేందుకు కంకణబద్ధులై నిలిచారు.
మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం పనిచేస్తా. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు అన్నివిధాలుగా అభివృద్ధి చేసి స్థానిక ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలన్నదే నా ఆశ. మక్తల్లో 150పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. మరిన్ని నిధులను తీసుకొచ్చి మక్తల్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని నిర్మిస్తాం.
– చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే, మక్తల్