అమ్రాబాద్, నవంబర్ 4 : కాంగ్రెస్ చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం పదర మండలంలోని రాయలగండితండా, పెట్రాల్చేనుకు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గువ్వల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మె ల్యే వంశీకృష్ణ ప్రజలకు మాయమాటలు చెప్పి పార్టీలో చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బలవంతంగా కాంగ్రెస్ కండువాలు కప్పి మోసం చేస్తున్నారని ఆరోపించారు. మాయమాటలతో ప్రజలను మోసం చేయలేరని బలవంతంగా ఎవరినీ తమవైపు తిప్పుకోలేరని చెప్పారు. రాయలగండితండాకు చెందిన కొంత మంది బీఆర్ఎస్ నాయకులను అడ్డదారిలో తమ వైపు తిప్పుకోవాలని చూసిన వారు తిరిగి బీఆర్ఎస్లోనే చేరారని కాంగ్రెస్ కుట్రలను వారు తిప్పికొట్టారని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా పెట్రాల్చేను ప్రజలు అందరూ అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడే బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటామని కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెటిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసుకొని ఆ పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో అచ్చంపేట అభివృద్ధి కమీషన్లకు మాత్రమే సరిపోయిందని నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో అచ్చంపేట అంతా అభివృద్ధి, సంక్షేమంలో వెలుగులు నింపుకుందని మేమంతా కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని ప్రకటించారు. కార్యక్రమంలో పదర బీఆర్ఎస్ నాయకులు రాంబాబునాయక్, శ్రీను, ఎల్లయ్య, జాన్సన్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు.
అభివృద్ధికి పట్టం కట్టండి
పదేండ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆదరించి పట్టం కట్టాలని, తన బలం..బలగం నియోజకవర్గ ప్రజలేనని విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం మండల కేంద్రంలో అగ్రహారంతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధి చేసే వారిని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గురువయ్యగౌడ్, రైతుబంధు మండల అధ్యక్షుడు గజ్జెయాదయ్యగౌడ్, సర్పంచులు ప్రశాంత్నాయక్, అనిశెట్టి శ్రీను, నరేశ్నాయక్తోపాటు పలువురు ప్రజాత్రినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ అభ్యర్థి ఖలీల్ శనివారం అచ్చంపేటలో ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా ఇతర రాష్ర్టాల నుంచి అచ్చంపేటకు వచ్చిన రాజస్థాన్కు చెందిన మారువాడిలు అచ్చంపేటలో వ్యాపారం కొనసాగిస్తున్న మాకు ఎప్పుడూ రక్షణగా ఉంటు న్న స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రుణపడి ఉంటామంటూ ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పులిజాల రమేశ్, కౌన్సిలర్ గోపిశెట్టి శివ, నాయకులు రహమత్, జబ్బు ఎల్లయ్యయాదవ్, గంట్ల సురేశ్, అంజిరెడ్డి, ఆక జయన్న, ఆకారపు లక్ష్మణ్, నర్సింహ, దూళ్ల సురేశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.