కోస్గి, అక్టోబర్ 22 : కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే ధైర్యం లేదని కొడంగల్ ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం కోస్గి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి, గుండ్లపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మట్లాడుతూ తొమ్మిదేండ్లుగా రేవంత్రెడ్డి ఎమ్మెల్యే గా నియోజకవర్గంలో చేసిందేమిలేదన్నారు. అందుకే ఆ పార్టీ నాయకులు దొంగళ్లా రాత్రి వేళ గ్రామాల్లో తిరు గుతూ సర్పంచ్లకు రూ.15లక్షలు ఇచ్చి కొనుగొళ్లు చేస్తు న్నారన్నారు. రేవంత్రెడ్డి పోతిరెడ్డిపల్లి గ్రామానికి కనీసం బీటి రోడ్డుకూడా మంజూరు చేయించలేక పోయా రన్నా రు. నియోజకవర్గ ప్రజలు గమనించి రేవంత్రెడ్డి గ్రామా లకు వస్తే తరమికొట్టాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్రతిగ్రామాన్ని అభివృద్ధి చేశానన్నారు. నేడు గ్రామాల్లో వీధిలైట్లు అద్బుతంగా ఉన్నాయని వాటి కింద మహిళలు బతుకమ్మ సంబురాలు నిర్వహించుకుటున్నా రన్నారు. 24గంటల కరెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం అంది స్తోందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ముందు అమాలు చేయాలని, తర్వత తెలం గాణ ప్రజలకు 6గ్యారింటీల గురించి వివరించాలన్నారు. 50ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయాని అభివృద్ధి ఇప్పుడు చేసిచూపిస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముత రన్నారు. రేవంత్రెడ్డి ఎమ్మెల్యే సీట్లు అమ్ముకొని డబ్బు లు సంపాదించి కొడంగల్లో లీడర్లను కొనుగొలు చేస్తున రన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే గ్రామాల్లో పర్య టించి గ్రామ ప్రజలతో ముచ్చటించారు. దుర్గమాత కు ప్రత్యేక పూజాలు చేశారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఏస్ స్టేట్ డైరక్టర్ నాగులపల్లి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మ్యకల శిరీషా, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు హన్మంతురెడ్డి, బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు మ్యకల రాజేశ్, కౌన్సిలర్లు బాలేశ్, బందెప్ప, బీఆర్ఏస్ నాయకలు రాజశేఖర్ రెడ్డి, సాయిలు, శంకరయ్య, కృష్ణ, రస్నం బాలరాజ్, హన్మంతు, గంగి రెడ్డి, వెంకట్నర్సింహులు, వెంట్రాములు తదితరలు పాల్గొన్నారు.