ధరణిపై కాంగ్రెస్ అక్కసు వెల్లగక్కింది. ఈ పోర్టల్ను తొలగించి భూమాత తీసుకొస్తామని చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లా పటేల్, పట్వారీల వ్యవస్థ వస్తే భూములు ఆగమైతాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూ పం చాయితీలు మొదలవుతాయని, దళారులు, లంచావతారు లు పుట్టుకొస్తారంటున్నారు. అసలు హస్తం పార్టీ నేతలకు ఎ వుసం తెలుసా అని నిలదీస్తున్నారు. రైతులను మోసం చేయాలని చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించా రు. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణినే బాగుందని, నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని సంతోషంగా చెబుతున్నారు.
రాష్ట్రంలో ధరణి పోర్టల్ ఉండడంవల్లే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సేవలు అందుతున్నాయి. ధరణి రద్దు చేస్తే రాష్ట్రంలో మళ్లీ భూ సమస్యలు ప్రారంభమవుతాయి. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో పడేస్తాం అంటున్నారు. అసలు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు. మర్చిపోయి పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ రైతులు తాసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులరిగేలా తిరగాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేసుకోవడానికే ధరణిని రద్దు చేస్తామంటున్నారు. గతంలో వ్యవసాయ భూముల పట్టా కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసిపోయేవారు. ఇప్పుడు ధరణితో ఒక్క రోజుల్లోనే రైతులకు భూమి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఎటువంటి దళారులను ఆశ్రయించాల్సిన పని లేకుండా పోయింది. ధరణి ఉండటంతో భూముల లెక్కలు తెలుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతులకు ఇంత సేవ చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే మా రైతులందరం ఉంటాం.
ఏ భూమి యాడ ఉంది.. ఎవ్వరికీ ఎంత భూమి ఉంది.. మొత్తం భూముల లెక్కలన్నీ ఇట్లే తెలిసిపోయేటట్ల ధరణిని మంచిగ తెచ్చిండ్రు. ధరణి రాకముందు భూమి గురించి ఏం పనిపెట్టుకున్నా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి సచ్చేటోళ్లం. రాత్రికి రాత్రి ఒకళ్ల నుంచి ఇంకొక్కళ్ల పేరుమీదికి భూమి మారేది. ఎవ్వరు పైసలిస్తే వాళ్ల పనులు చేసెటోళ్లు ఆఫీసర్లు. భూముల సమస్యలతోటి ఎంతోమంది రైతులు శానా ఇబ్బందులు పడుతుండ్రి. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సీఎం కేసీఆర్ సారు ధరణిని తెచ్చినంక మనం ఎక్కడ ఉన్నా మన భూమి ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఎవ్వరికీ పడితే వాళ్లకి భూమి మార్చకుండా అయ్యింది. మోసాలు చేయకుండా చేసింది. ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ నిమిషాల్లోనే అయిపోతుంది. అర్ధగంటల పట్టా కాగితాలు చేతుల పెడుతున్నారు. ఆఫీసర్లు కూడా శానా మంచిగ పనిచేస్తున్నారు. అప్పట్ల నెలలు నెలలు తిరిగినా పనులు చేసేటోళ్లు కాదు. ఇప్పుడేమో ఒకరోజు స్లాట్ బుక్ చేసుకుంటే మరుసటి రోజు పని అయిపోతుంది. భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా.. ఏం సమస్యలేకుండా పని జరుగుతుంది. ఆఫీసు చుట్టూ తిరిగే పనికూడా లేకుండానే పని పూరైతుంది. గతంలో ఊర్లె సర్పంచ్, ఓ పైరవీకారు, పట్వారీ, ఇంకా ఆఫీసర్ల చుట్టూ తిరిగి, పైసలిచ్చి టైమ్ వేస్ట్ చేసుకునేది. ఇప్పుడెవ్వరితో పనిలేకుండా ఆన్లైన్లో బుక్చేసుకొని గంటలో పని చేసుకొని బయటికి రావొచ్చు. ఇదంతా ధరణి వచ్చినందుకే ఈజీగా అయితుంది. ధరణి వల్లనే భూములు కూడా భద్రంగా ఉంటున్నాయి. ధరణిని గిట్ల తీసేస్తే మళ్లీ పాతరోజులు వచ్చి దళారీలు వస్తారు. మళ్ల చెప్పులరగనింకె ఆఫీసుల చుట్టూ తిరగాలె. మళ్లీ భూ సమస్యలు మొదలైతాయి. ధరణి వచ్చినంక ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగకుండా చేసింది. కాంగ్రెస్సోళ్లకి ఓటేస్తే ధరణి రద్దు చేసి రైతులను ఆగం చేస్తారు. ధరణి ఉండాలంటే కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ సారునే గెలిపించాలి.
ధరణి తీసేసి రైతులను మోసం చేయడానికే కాంగ్రెస్ కుట్రలు పన్నుతుంది. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను తీసేస్తామంటున్నారు. అదే జరిగితే భూ కబ్జాలు పెరిగిపోతాయి. ప్రజలు, రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. మీసేవలో స్లాట్ బుక్ చేసుకొని తాసీల్దార్ కార్యాలయానికి వెళ్తే గంటలో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుని వెంటనే ఈ-పాసుబుక్ను తీసుకుంటున్నాం. ఇంత మంచిగా పని జరుగుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ధరణి తీసేస్తాం అని రైతులను ముంచే మాటలు మాట్లాడుతున్నారు. ధరణితో మా భూముల వివరాలు మా ఖాతాలో భద్రంగా ఉన్నాయి. ఇన్ని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ కుట్ర పూరితంగా చర్యలు చేపడుతున్నది. ధరణి పోర్టల్ను తీసువేసి రైతుల మధ్య ఘర్షణలను పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. కాంగ్రెస్ నేతలకు తగిన బుద్ధి చెప్పాలంటే గ్రామాల్లోకి వారిని రానివ్వద్దు.
రెవెన్యూ విభాగంలో పట్వారీతనం అమల్లోకి వస్తే రైతుల నోట్లో మట్టి పడడంతోపాటు భూముల సమస్యలు పెరిగిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. భూ పంచాయితీలు కుప్పలు కుప్పలుగా పేరిపోవడంతో సీఎం కేసీఆర్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేసి రైతుల బతుకులను చీకట్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. ధరణి పోయి పట్వారీవ్యవస్థ వస్తే దళారులు రాజ్యమేలుతారు. గతంలో అన్నీ సక్రమంగా ఉండి విరాసత్ చేయించుకోవాలన్నా.. పట్వారీలకు వేలకు వేల రూపాయలను అప్పజెప్పాల్సి వచ్చేది. అప్పటికీ విరాసత్ అవుతుందన్న నమ్మకం ఉండేది కాదు. కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగితే తప్పా పనులు చేసేవారు కాదు. ఇప్పుడు విరాసత్ చేసకునేవాళుల మీ సేవకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని జరుగుతున్నది. నేడు రైతులంతా ఎలాంటి చీకుచింత లేకుండా హాయిగా బతుకుతున్నారు. మాలాంటి వారి కోసం అహర్నిశలు పాటుపడుతున్న సీఎం కేసీఆర్ వెంటే తామంతా ఉంటాం.
కాంగ్రెస్ నాయకులు దళారుల రాజ్యం తీసుకొచ్చేందుకే ధరణి పోర్టల్ను తీసేస్తమంటున్నారు. అదే జరిగితే రైతుల బతుకులు మళ్లీ అంధకారంలోకి పోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తరువాత రైతులు తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా పోయింది. గతంలో ఎకరం పొలం కొన్నా వారి పేర చేసుకునేందుకు చెప్పులరిగేలా తిరిగినా పని జరిగేది కాదు. లంచాలు ఇచ్చి.. రోజుల తరబడి అదే పని పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ జరిగేది. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక ఇప్పుడు పట్వారీతో పనిలేదు. ఖర్చులు, శ్రమ లేకుండా ఒక్కరోజే పట్టాదారు పాసుబుక్కులు తీసుకుంటున్నాం. ధరణి పోర్టల్తో రైతులకు ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు నేరుగా అందుతున్నాయి. దురదృవశాత్తు రైతు మరణిస్తే రైతుబీమా సొమ్ము నామినీ ఖాతాలో జమచేస్తున్నారు. ధరణి పోర్టల్ తీసి దళారీ వ్వవస్థను పెంచిపోషించేందుకు కాంగ్రెస్ నాయకులు కంకణం కట్టుకున్నారు. ధరణి పోర్టల్ ఉంటేనే మేలు జరుగుతుంది. రైతుల కోసం పని చేసే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి కారు గుర్తును గెలిపించుకోవాలి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తరట. అదే గనుక జరిగితే మళ్లీ దళారి రాజ్యం వస్తుంది. ధరణి లేకుంటే భూ రికార్డులో రైతుల వివరాలను ఇష్టమొచ్చినట్లుగా నమోదు చేస్తారు. భూతగాదాలు రోజురోజుకూ ఎక్కువైతాయి. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిన తరువాత రైతులకు భూములపై భరోసా ఏర్పడింది. పొరపాటున కూడా కాంగ్రెస్కు ఓటు వేయొద్దు. రైతులకు మేలు చేసిన బీఆర్ఎస్కు అండగా నిలవాలి. 24 గంటల కరెంట్తోపాటు పుష్కలంగా సాగునీరందిస్తుండడంతో భూములను బీడు పెట్టకుండా సాగు చేస్తున్నారు. రైతుబంధు పడడంతో వ్యవసాయంపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ధరణి వచ్చిన తరువాత మండల కార్యాలయంలో గంటలోనే రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత భూముల రేట్లు పెరిగిపోయాయి. ధరణితో రైతుబంధు, రైతుబీమా వస్తున్నది. ధరణి పోతే రైతులకు మళ్లీ తిప్పలు తప్పవు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలకు మోసపోతే గోసతప్పదు. ధరణి రద్దు చేస్తే రైతులు తిరుగబడుతారు.
కేసీఆర్ ప్రభుత్వం ధరణి ఫోర్టల్ ప్రారంభించకముందు.. పటేల్, పట్వారీ పాతుకుపోయింది.. వీఆర్వోల ఇంటి దగ్గరనే పహాణీ రికార్డులు ఉండేవి.. వీఆర్వోల ఇంటి చుట్టూ రాత్రి వరకు ప్రజలు తిరగాల్సి వస్తుండే.. పటేల్ పట్వారీ, రెవెన్యూ వ్యవస్థలో అక్రమాలు, అన్యాయాలు, నిలువెత్తు దోపీడీకి ఎంతో మంది బలయ్యారు. దళారులకు డబ్బులు ముట్టించే వారిదే పై చేయిగా ఉండేది. దీంతో సొంత అన్నదమ్ములకు పంచాయితీలు జరిగేది.. పోలీస్ స్టేషన్, కోర్టు, జైళ్ల పాలు అయ్యేవారు. వీఆర్వోలు రాసిందే రాత, గీసిందే గీతగా నమోదయ్యేది. వాళ్లు ఆ డిందే ఆట.. పాడిందే పాటగా ఉండేది. ఒక వ్యక్తి వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి పొందాలంటే సవాలక్ష ఇబ్బందులు ఉండేవి. డాక్యుమెంట్ రైటర్ నుంచి ప్రతి ఒక్కరి చేతులు తడపాల్సి వచ్చేది. చేతిలో పాస్బుక్ ఉన్నప్పటికీ మరొకరి పేరుతో పాసుబుక్ అక్రమంగా తయారు చేసుకొని బ్యాంకులో లోన్లు కూడా తీసుకునేవారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత దోపీడి విధానాలు తగ్గిపోయాయి. ప్రశాంతంగా ఉన్న రైతుల కంట్లో పోసే పార్టీకి కాకుండా.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ పార్టీ కారు గుర్తుకే మనందరం ఓటేయ్యాలి.