దైవ కార్యానికి హాజరయ్యేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బాలరాజును పోలీసులు నిర్బంధించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి లింగాల మండలం అంబటిపల్లిలో జరిగే ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు వెళ్తున్న గువ్వల వాహన శ్రేణిని వెల్దండ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గువ్వలతోపాటు ఆయన సతీమణి అమలను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉంచడంతో ఈ విషయం తెలుసుకున్న
బీఆర్ఎస్ శ్రేణులు వందలాదిగా పీఎస్ వద్దకు చేరుకొని బైఠాయించారు. గువ్వలను రాష్ట్ర రాజధానికి తరలించేందుకు బయటకు తీసుకురావడంతో పార్టీశ్రేణులు అడ్డు తగి లారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకు న్నది. అనంతరం కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి గువ్వల దంపతులను పోలీస్ వాహనంలో హైదరాబాద్కు తరలించారు. అంతకు ముందు గువ్వల మాట్లాడుతూ కాంగ్రెస్ అధికార దుర్వినియో గానికి పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో ఇంత అరాచకమా.. అంటూ ధ్వజమెత్తారు.
వెల్దండ, డిసెంబర్ 18 : అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం తన సతీమణితో కలిసి అ చ్చంపేట నియోజకవర్గం లింగాల మం డలం అంబటిపల్లి గ్రామంలో ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కా ర్యక్రమానికి బయలుదేరారు. బీఆర్ఎస్ శ్రేణులు సోష ల్ మీడియాలో పెట్టడంతో విషయం తెలుసుకున్న కాం గ్రెస్ పార్టీ నాయకులు ఎలాగైనా అడ్డుకోవాలని హాజీపూ ర్ చౌరస్తాలో సమావేశమయ్యారు. అప్రమత్తమైన పో లీసులు వెల్దండలో వాహనాన్ని అడ్డుకొని గువ్వల బాలరాజు దంపతులను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో రెం డు గంటల పాటు ఇద్దరిని నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలు, గువ్వల అభిమానులు వందలాదిగా వెల్దండ పోలీస్స్టేషన్కు తరలివచ్చారు. తమ నాయకుడిని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చే స్తూ పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు. దైవ కార్యానికి వెళ్తున్న ప్రజా నాయకుడిని అడ్డుకోవడం ఏమిట ని నిలదీశారు. ప్రజాసామ్యంలో ఇంత అరాచకం ఏమిటని ప్ర శ్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు న్న బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు పోలీసు లు వాహనాలు తీసుకువచ్చి వారిని ఈడ్చుకెళ్లే క్రమంలో పోలీసు లు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్యతోపులాట జరిగింది.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి పట్టుమని పదిరోజులు కాకముందే అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంద ని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. పోలీ స్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గువ్వల బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రం లో అరాచక పాలన సాగుతుందన్నారు. దైవ కార్యానికి వెళ్లే మమ్మల్ని పోలీసులచే అడ్డగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టుకోలేని సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో పాలన ఎలా సాగిస్తాడని ప్రశ్నించారు. ప్రజాసామ్యబద్ధంగా పాలన సాగించే ఆలోచన ఉంటే సీఎం రాష్ట్ర వ్యాప్తంగా దాడులను అరికట్టే విధంగా చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే ఆగడాలను కొనసాగిస్తే ప్రజల మద్దతుతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తో ప్రజాసామ్యబద్ధంగా ముందుకు వెళ్తామన్నా రు. ప్రజానాయకులను నిర్భందించి పాలన సాగించాలనుకోవడం ప్రజాసామ్య విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ నా యకులు, కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తే సహించేంది లేదన్నారు. ఎక్కడికక్కడ మీ ఆగడాలను అ రికడతామని హెచ్చరించారు. అనంతరం గువ్వల బాలరాజు దంపతులను హైదరాబాద్కు తరలించేందుకు పోలీసులు పోలీస్స్టేషన్ బయటకు తీసుకరాగా కార్యకర్త లు అడ్డుకున్నారు. మరోసారి పోలీసుల కు కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాగా క ల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి కల్పించుకొని గువ్వలను పోలీస్ వా హనంలో హైదరాబాద్కు తరలించారు.