గద్వాల, మే 6 : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి.. వాటిని అమలు చేయలేక కాంగ్రెస్ ప్ర భుత్వం చతికిలపడిపోయిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ప్రవీణ్కుమార్కు మద్దతుగా గద్వాల మున్సిపాలిటీలోని 32, 33 చింతలపేట వార్డుల్లో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు సాగారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు నా ణ్యమైన విద్యుత్ సరఫరా జరిగేదని వివరించారు. వార్డు ప్రజలు నీటి సమస్య ఎదుర్కునే వారని, బీఆర్ఎస్ మిషన్ భగీరథతో చెక్ పెట్టిందన్నారు. 150 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక సమస్య లు ఎదుర్కొంటున్నారన్నారు. సీఎం పాలనను గాలికొదిలేసి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఐదు నెలల కింద తెలంగాణ ఎట్లుండే.. ఇ ప్పుడెట్లుందో ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. బీజేపీ ఏనాడూ తెలంగాణ ప్రయోజనాలు, రైతాం గం కోసం పని చేయలేదన్నారు. కేవలం హిందు త్వం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి మత ఘర్షణల ను ప్రేరేపిస్తున్నదన్నారు. అనంతరం ప్రజలతో కలిసి ఎమ్మెల్యే టిఫిన్ చేశారు. ఆయన వెంట ము న్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, దౌ లు, శ్రీనివాసులు, నాయకులు కృష్ణారెడ్డి, వేణుగోపాల్, సీతారాములు, రామాంజి, గోవిందు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
గద్వాల రూరల్, మే 6 : ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దామని ఎమ్మెల్యే బండ్ల పిలుపునిచ్చారు. జ మ్మిచేడు 4, 5వ వార్డుల్లో ప్రచారం చేశారు. కార్య క్రమంలో కౌన్సిలర్ మురళి, నేతలు చెన్నయ్య, గోవిందు, సతీశ్, వేణుగోపాల్, కురుమన్న, సాయిరెడ్డి, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.