60ఏండ్లు పాలించి పాలమూరును కరువు జిల్లాగా కాంగ్రెస్ మార్చిందని, నేడు ఆరు గ్యారెంటీలంటూ గ్యారెంటీ లేని హామీలతో ప్రజలను మరోసారి దగా చేయాలని చూస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. స్క్యాంలకు మారుపేరుగా నిలిచిన కాంగ్రెస్ను ప్రజలు నమ్మితే అభివృద్ధి వెనక్కి వెళ్లిపోతుందని, దగాకోరు పార్టీని పాతరేసి ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్కు ఓటు వేయాలని మంత్రి కోరారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని బండమీదిపల్లి, గొల్లబండతండా, రాజీవ్ గృహకల్పతోపాటు పోతన్పల్లి, మాచన్పల్లి, రాంచంద్రాపూర్ గ్రామాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. డప్పు చప్పుళ్లతో ర్యాలీగా వచ్చి ఘన స్వాగతం పలికారు. మంత్రిని పార్టీశ్రేణులు భుజాలపై ఎత్తుకొని అభిమానం చాటారు. అలాగే పోతన్పల్లిలో మంత్రి శ్రీనన్న కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మక్తల్కు చెందిన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజుల ఆశిరెడ్డి, బీజేపీ దళితమోర్చ సీనియర్ నేత జయానంద్తోపాటు పలువురు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
మహబూబ్నగర్ టౌన్, అక్టోబర్ 27 : తెలంగాణకు ఢిల్లీ నుంచి ఎవరూ బా స్లు లేరని, ప్రజలే మా బాస్లని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 13వ వార్డు బండమీదిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చౌరస్తాలో మంత్రి శ్రీనివాస్గౌడ్కు కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బండమీదిపల్లి చౌరస్తాలో మంత్రి మా ట్లాడారు. రైతుబంధు వద్దని కాంగ్రెస్ సన్యాసులు కేసులు వేస్తున్నారని, అ లాంటి వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చె ప్పాలన్నారు. నిరంతరం ప్రజా సం క్షేమం కోసం పని చేసే వాళ్లు కా వాలా? ఎన్నికల సమయంలో మాయమాటాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేవా రు కావాలే ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు నవంబర్ 30 తర్వాత పనిచేయవని, తాము 24గంటలు 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉం టామన్నారు. ఆ గట్టునుంటావా నాగ న్న.. ఈ గట్టునుంటావా అనే సినిమా పాటలాగా అభివృద్ధి, అభివృద్ధి నిరోధకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. పింఛన్ల పెంపు, సన్నబియ్యం, పేద మహిళలకు రూ.3వేల జీవనభృతి, ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవితబీమా, రూ.400కే సిలిండర్, ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇస్తామన్నారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతుండగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం పేదలకు ఇచ్చే పథకాలు వద్దు అంటున్నదన్నారు. అదేవిధంగా 12, 25, 26వ వార్డులో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న. కౌన్సిలర్లు లక్ష్మి, షేక్ఉమర్ పాల్గొన్నారు.
కేసీఆర్ కుడి భుజంలా ఉండి మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ను గతంలో ఎప్పుడూ లేనంతగా అభివృద్ధ్ది చేస్తున్నారని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఆంజనేయులుగౌడ్ అన్నారు. తా ము చదువుకునే రోజుల్లో ఎంతో వెనకబడిన మహబూబ్నగర్ నేడు ఊహించని విధంగా అభివృద్ధి చెందిదన్నారు. మరింత అభివృద్ధి చేందాలంటే శ్రీనివాస్గౌడ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో ఎంతో వెనకబాటుకు గురైన గొల్లబండతండా పక్కనే బైపాస్ రోడ్డు వ స్తుందని మంత్రి అన్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లబండతండా, రాజీవ్గృహకల్ప ప్రజలు మం త్రి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు.
పాలమూరు, అక్టోబర్ 27: మహబూబ్నగర్ మండలంలోని పోతన్పల్లి, మాచన్పల్లి, రాంచంద్రపూర్ గ్రామాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోతన్పల్లి గ్రామంలో ఇప్పటివరకు కేవలం పింఛన్ల కోసమే రూ.7.61కోట్లు అందజేశామని, 76మందికి కల్యాణలక్ష్మి ద్వా రా సాయం అందించామన్నారు. 24 మంది రైతుల కుటుంబాలకు రూ.5లక్ష ల చొప్పున రైతుబీమా అందించామన్నా రు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఎంపీపీ సు ధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 27 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మక్తల్ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రా జుల ఆశిరెడ్డి, బీజేపీ దళితమోర్చా సీనియర్ నాయకు డు జయానంద్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో వారు బీఆర్ఎస్లో చేరారు. కా ర్యక్రమంలో సాట్స్ చైర్మన్ ఆంజనేయులుగౌడ్, నారాయణపేట రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు సుచరిత, శ్రీనివాస్గుప్తా, రాజేశ్ ఉన్నారు.