మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 8 : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టేడియం మైదానంలో ఉమ్మడి జిలా ్లరగ్బీ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను డీవైఎస్వో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉంటుందని తెలిపారు.
క్రీడల్లో గెలుపు, ఓటుములు సహజమని, క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభచాటి విజేతగా నిలువాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో డీవైఎస్వో కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్రెడ్డి, వ్యాయమ ఉపాధ్యాయులు వేణుగోపాల్, నిరంజన్రావు, జగన్మోహన్గౌడ్, సూర్యప్రకాశ్, సత్యం పాల్గొన్నారు.