నాగర్కర్నూల్, మార్చి 4 : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 16 ఫిర్యాదులు అందాయి. వాటిని కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు అందజేసి మాట్లాడారు. 15 భూ సమస్యలపై కాగా, ఒకటి విద్యాశాఖకు సంబంధించిన ఫిర్యాదు వచ్చిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కుమార్దీపక్, సీతారామారావు, డీఆర్డీఏ చిన్న ఓబులేషు, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి పది ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రామేశ్వర్ ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిష్కరించాలని ఆయా ప్రాంతాల పోలీస్ అధికారులను ఆదేశించారు. న్యాయం చేయాలని ఆరు, భూమి పంచాయితీకి సంబంధించి నాలుగు ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.