మూసాపేట, అక్టోబర్ 17 : మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని సోమవారం కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానను పరిశీలించడం తోపాటు, రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీశారు. హాజరు రికార్డులను పరిశీలించారు.
విధులకు హాజరుకాని జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, అటెండర్ రహీం, మరో ఉద్యోగి శ్రీనివాస్ను సస్పెన్షన్ చేస్తూ, సీహెచ్వో, హెచ్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జానంపేట, తాళ్లగడ్డ గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాల పనులు పూర్తి చేయకపోవడంపై ఎంపీడీవో స్వరూప, ఏపీవో పులేందర్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఫిర్యాదులు పరిష్కరించాలి
ధరణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. మూసాపేట తాసిల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. గ్రామాల వారీగా ఆర్వోఆర్, పహాణి, భూ రికార్డులను పరిశీలించారు. ధరణి మాడ్యూల్స్ ప్రకారం సమస్యలను పరిష్కరిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. భూసమస్యల పరిష్కారానికి కలెక్టర్ తాసిల్దార్ మంజుల, నాయబ్ తాసిల్దార్ వరప్రసాద్కు పలు సూచనలు, సలమాలు చేశారు.