నారాయణపేట టౌన్, మార్చి 27 : ప్రభుత్వ దవాఖానల్లో బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్లో వైద్యశాఖ అధికారులతో స మావేశమై మాట్లాడారు. ప్రజలకు వైద్యం అందించేందుకు వైద్యాధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉం డాలన్నారు. బయోమెట్రిక్ హాజరు లేకపోతే జీతం క ట్ చేయాలని, విధులకు మూడురోజులు ఆలస్యంగా వచ్చినా జీతం కట్ చేయాలన్నారు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటన వివరాలను ముందే అందజేయాలన్నారు. వైద్య సిబ్బంది ఈనెలలో ఎన్ని ఇండ్లను సందర్శించారు? పీహెచ్సీలు, సబ్సెంటర్ల వారీగా మందుల పంపిణీ, కమ్యూనిటీ మొబిలైజేషన్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మక్తల్లో ప్రైవేట్ దవాఖానల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్లియర్ చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో సౌభాగ్యలక్ష్మి, డీఐవో శైలజ, ఎంపీహెచ్ఈవో గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఉండదని, ప్రజల అవసరాలకు సరిపడా నీరు సరఫరా చేస్తామని కలెక్టర్ శ్రీహర్ష బుధవారం ప్రకటనలో తెలిపారు. మి షన్ భగీరథ ద్వారా జిల్లాలోని 172 గ్రామాలకు కోయిల్సాగర్ రిజర్వాయర్ నుంచి చందాపూర్, కుసుమద్పల్లి నీటిశుద్ధి కేంద్రం ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. కోయిల్సాగర్లో ప్రస్తుతం 0.83 టీఎంసీల నిల్వ ఉందని, తాగునీటికి కొరత ఉండదన్నారు. జూ రాల వెనుక జలాల నుంచి జిల్లాలోని 59 గ్రామాలకు పారేవుల, నందిమల్ల పథకాల ద్వారా నీరు అందుతుందని, జూరాలలో నీరు తగ్గినా సంగంబండ రిజర్వాయర్లో అందుబాటులో ఉన్న 0.7 టీఎంసీల్లో 0.5 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. పేట మున్సిపాలిటీలో ప్రతిరోజూ 7.30 ఎంఎల్డీలు, మక్తల్ మున్సిపాలిటీలో 2.80 ఎంఎల్డీల నీరు అవసరం ఉండగా మన్యంకొండ నీటిశుద్ధి కేంద్రం నుంచి సరఫరా జరుగుతుందన్నారు. భగీరథ నీటి సరఫరాలో ఆటంకం కలిగితే ప్రత్యామ్నాయంగా పేటలో 104, మక్తల్లో 140 పవర్ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. కోస్గి మున్సిపాలిటీలో 3,740 కేఎల్ల తాగునీరు అవసరం ఉండగా మిషన్ భగీరథ ద్వారా 1,390 కేఎల్, పవర్ బోర్ల ద్వారా 6,069 కేఎల్ల నీటిని సరఫరా చేస్తున్నారన్నారు.