మహబూబ్నగర్ అర్బన్, మే 27: మహబూబ్నగర్ లోకసభ ఎన్నికల కౌంటింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ చె ప్పారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఎన్నికల సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో ఆబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గ్గొని మా ట్లాడారు. కౌంటింగ్ కేంద్రంలో అనధికార వ్యక్తులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎ న్నికల అధికారులు సూచించిన ఐడీ కార్డులు ధరించి న వారిని మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతించాలన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్ర తాప్, మోహన్రావు మాట్లాడుతూ కౌంటింగ్ పద్ధతులను పాటించాలని చెప్పారు. ఒక్క కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తారని, ఒక్కో టేబుల్కు ఒక సూపర్వైజర్, సహాయకులు ఉంటారని తెలిపారు. సి బ్బంది కౌంటింగ్ విధులపై సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు. నోడల్ అధికారి శ్రీధర్ సుమన్ మా ట్లాడుతూ ఈ శిక్షణలో 83 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 98 మంది సహ అధికారులు, 12 మంది ట్యాబ్యులేషన్ సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు.
యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన ధాన్యంను వేగం కొనుగోళ్లు పెంచాలని కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వెబెక్స్ సమావేశం ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, పాఠశాల విద్యార్థులకు యూ నిఫాం పంపిణీ, పారిశుధ్యంపై సమీక్షించారు. మిగిలిన వరి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి రైతులకు డ బ్బులు చెల్లించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాం జూన్ 6వ తేదీలోగా పంపిణీ చేయాలని, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పా ఠశాలలో చేపట్టిన పనులను పూర్తి చేయాలని, సివిల్ సప్లయ్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వర్షాకాలం ఇబ్బందులపై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అధికారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్రావు పాల్గ్గొన్నారు.