నర్వ, డిసెంబర్ 30 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టి న పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన పనులను త్వ రగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మం డలంలోని రాయికోడ్ ఎంపీయూపీఎస్, పాతర్చేడ్లోని ఎంపీపీఎస్, ఉందేకోడ్లోని ఉన్నత పాఠశాల, మండలంలోని ఎంపీపీఎస్ పాఠశాలలను శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. ఆయా పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను పర్యవేక్షించి వేగంగా పూర్తి చే యాలని ఎస్ఎంసీ సభ్యులు, సర్పంచులను ఆదేశించారు. మండలంలో మొదటి విడుత కింద తొమ్మిది పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, ఎంపికైన వాటిలో పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకా రం చేయవలసిన పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులను త్వరగా స మర్పించాలని డీఈ, ఏఈలను ఆదేశించారు. కార్యక్రమం లో విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, డీఈ రా ము, ఏఈ శ్రీకాంత్, సర్పంచులు, ఎస్ఎంసీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
మరికల్, డిసెంబర్ 30 : ప్రతి పాఠశాల ల్లో ఎఫ్ఎల్ఎన్ మేళాను నిర్వహించాలని, ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరు కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని చిత్తనూర్ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పాఠశాలకు హెచ్ఎం రాధమ్మ హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల సమయానికి రాని ఉపాధ్యాయినిపై చర్యలు తప్పవని కలెక్టర్ హె చ్చరించారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్ట ర్, విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు. వివిధ అంశాలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబు రాబట్టారు. హెచ్ఎంపై గ్రామస్తులతోపాటు సర్పంచ్ కలెక్టర్కు ఫిర్యాదు చే శారు. పాఠశాలకు హాజరు కాని హెచ్ఎం రాధమ్మపై చర్య లు తీసుకుంటామన్నారు.
చిత్తనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్ర ధానోపాధ్యాయిని రాధమ్మను కలెక్టర్ ఆదేశాలతో సస్పెన్షన్ చేసినట్లు ఇన్చార్జి డీఈవో గోవిందరాజులు తెలిపారు. పాఠశాలకు విధులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనిపై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంతోపాటు విద్యాశాఖ అధికారులు అనేకసార్లు పాఠశాలను తనిఖీ చేసిన ప్రతిసారి ఆమె విధులకు హాజరు కావడం లేదన్నారు. కలెక్టర్ ఆకస్మికంగా పాఠశాల ను తనిఖీ చేసిన సమయంలో కూడా హెచ్ఎం రాధమ్మ వి ధులకు హాజరు కాకపోవడంతో సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ ఆ దేశాల ప్రకారం ఉత్తర్వులు జారీ చేశామన్నాని ఇన్చార్జి డీ ఈవో తెలిపారు.