కృష్ణ, డిసెంబర్ 17 : ఉపాధ్యాయులు సమయపాలన పాటించి సమయానికి తమ పాఠశాలలకు చేరుకోవాలని క లెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎంపిక చేసిన పాఠశాలలను శనివారం కలెక్టర్ పరిశీలించారు. మండలంలోని క న్సి, హిందుపూర్తోపాటు పలు గ్రామాల్లోని పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులతో ఉపాధ్యాయుల బోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కలెక్టర్ తో మమేకమై ముచ్చటించారు. ఇంగ్లిష్ తరగతి కొనసాగుతున్న సమయంలో గదిలోకి ప్రవేశించిన కలెక్టర్ ఇంగ్లిష్ పేరాను విద్యార్థిని నుంచి చదివించి దాని అర్థాన్ని తెలుగు లో చెప్పమని అడిగారు. మౌలిక వసతులపై ప్రధానోపాధ్యాయలతో కలిసి పాఠశాలల్లో జరుగుతున్న పనులను పరిశీలించి, నాణ్యతను పాటించి పూర్తి చేయించుకోవాలన్నారు.
అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమ పనులను త్వరితగతిన పూర్తి చేసుకొని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు పనిచేయాలని కోరారు. అదేవిధంగా గ్రామాల్లో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్ ఎంపీడీవో, ఎంపీవో, కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, మండల విద్యశాఖ అధికారి లక్ష్మీనారాయణ, స ర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్, డిసెంబర్ 17 : విద్యార్థులు కష్టపడి కాకుం డా ఇష్టంగా చదివితే చదువులో రాణిస్తారని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శనివారం కలెక్టర్ తనిఖీ చేశారు. 5వ తరగతిలో వి ద్యార్థులకు గణితంలో స్థాన విలువలపై నేర్పించే విధానాన్ని పరిశీలించారు. సరైన సమాధానాలు ఇవ్వడంతో కలెక్టర్ వి ద్యార్థులు, ఉపాధ్యాయురాలిని అభినందించారు. పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పనులను పరిశీలించి శిథిలావస్థలో ఉ న్న భవనాలను తొలిగించాలని అధికారులకు సూచించారు. అనంత రం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నో బ్యాగ్ డే జరుపుకొంటున్నామని కలెక్టర్కు విద్యార్థు లు తెలిపారు.
పాఠశాలను పరిశీలిం చి ప్రహరీ నిర్మించాలని, మిగతా ప నులు పూర్తి చేయాలన్నారు. నేరడ గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను సందర్శించి ఉపాధ్యాయులతో సమావేశమై అందరూ సమయాని కి పాఠశాలకు చేరుకోవాలని సూ చించారు. విధులపై అలసత్వం వ హిస్తే చర్యలు తప్పవన్నారు. ఎట్టి పరిస్థితులలో ఉపాధ్యాయులు సమయానికి చేరుకోవాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో జరుగుతు న్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూ చించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ప్రధానోపాధ్యాయుడు శివరాజ్, ఇన్చార్జి ఎంఈవో లక్ష్మీనారాయణ, కాం ప్లెక్స్ హెచ్ఎం నర్సింహులు, సెక్టోరియల్ జిల్లా అధికారి శ్రీ ను, పంచాయతీరాజ్ ఏఈ, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, ఎం పీవో జైపాల్రెడ్డి, ఇన్చార్జి ఎంఆర్వో అమీర్, ఉపాధ్యాయు లు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి మండలంలోని పాఠశాలలు, కళాశాల బాలబాలికల వసతి గృహాల విద్యారంగ సమస్యలపై కలెక్టర్ శ్రీహర్షకు భారతీయ విద్యార్థి ఫెడరేషన్ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షు డు నర్సింహ మాట్లాడుతూ ఉమ్మడి మండలంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్ర భుత్వ బాలుర వసతి గృహాలకు కూడా ప్రహరీ లేదని, అదేవిధంగా బాలికల వసతి గృహం సొంత భవనం లేక అద్దె భవనంలో కొనసాగుతుందన్నారు. నూతన భవనం ఏర్పా టు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమం లో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, డిసెంబర్ 17 : మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో శనివారం స మావేశం నిర్వహించి మాట్లాడారు. త్వరలో రెండో విడుత పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటి విడుత పనులు పూర్తి చేయాలన్నారు. మొదటి విడుతలో 168 పాఠశాలలను ఎంపిక చేయగా ఇప్పటికే 80శాతం పనులు పూర్తి కాగా మిగతా ఉన్న ప్రహరీ, పెయింటింగ్, విద్యుత్ పరికరాల ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామా ల్లో వేస్తున్న బీటీ రోడ్డు పనులను త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ నరేందర్, ఏఈలు పాల్గొన్నారు.