మహబూబ్నగర్ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం అడ్డాకుల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదలకు వైద్య సేవలు భారం కొవొద్దని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నారన్నారు. దరఖాస్తు చేసుకొన్న అందరికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని అర్హులైన పేద వారందరికి అందిస్తున్నామన్నాని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.