నాగర్కర్నూల్, డిసెంబర్ 30: సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సీఐకి సకాలంలో అం దిం చకుండా జాప్యం చేస్తున్న రైస్మిలర్లపై పీ డీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసు కోవాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారుల ను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీ డియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కస్ట మ్ మిల్లింగ్ రైస్ డెలివరీ ప్రక్రియపై మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క లెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం సేక రించిన ధాన్యం తీసుకున్న మిల్ల్లర్లపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేశారు. అధికారులు ఆయా రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికా రులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన ధా న్యం నిల్వలు విజిలెన్స్ తనిఖీ చేసి, నిల్వల్లో వ్యత్యాసం వచ్చిన మిల్లర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో సీఎం ఆర్ పెండింగ్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
కల్వకుర్తి లక్ష్మీ వెంకట నర సింహస్వామి పారాబైడ్ రైస్మిల్ ఇప్పటి వర కు ఒక ఏసీకే కూడా ఎఫ్సీఐకి అందించ కుండా 13 ఏసీకేలు పెండింగ్లో ఉండడంతో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సీతా రామాంజనేయ ఇండస్ట్రీస్ గుడిపల్లి 162 ఏసీ కేలు పెండింగ్ ఉండడం, 50శాతం పెండింగ్ ఒకేమిల్లులో ఉండడంపై కలెక్టర్ ఆగ్రహం వ్య క్తం చేశారు. తనిఖీలు నిర్వహించి ధాన్యాన్ని పరిశీలించాలని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో పది రైస్ మిల్లుల వద్ద పెండింగ్లో ఉన్న 324 ఏసీకేలను ఎఫ్సీఐకి అందించకపోవడంపై ప్రశ్నించారు. 2022-23 యాసంగి, వానాకాలం సీజన్ కింద 92, 897 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి అందించాల్సి ఉండగా 43,064 మెట్రిక్ ట న్నులే అందించారని, 49,833 మెట్రిక్ ట న్నులు ఇంకా అందాల్సి ఉందన్నారు. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సం దర్భంగా 15 రోజుల్లో వందశాతం బియ్యాన్ని ఎఫ్సీఐకి అందిస్తామని కలెక్టర్కు మిల్లర్లు హా మీ ఇచ్చారు. గతంలోని డిసెంబర్ 30 వరకు డెడ్లైన్ విధించిన విషయాన్ని కలె క్టర్ గుర్తు చేశారు. అధిక శాతం పెండింగ్లో ఉంచుకున్న మిల్లర్ల నుంచి ఇతర మిల్లర్లకు ధాన్యాన్ని బద లాయించాలనిఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా సివి ల్ సప్లయ్ అధికారి స్వామికుమార్, డీఎం సివిల్ సప్లయ్ బాలరాజు, మిల్లర్ల అసో సియేషన్ అధ్యక్షుడు జూలూరి రమేశ్, అసో సియేషన్ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.
రోజువారి లక్ష్యాలను పూర్తి చేయాలి ; రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
నాగర్కర్నూల్, డిసెంబర్ 30: రైస్ మిల్లర్లు, వారికి కేటాయించిన రోజు వారి లక్ష్యాలను మిల్లింగ్ కెపాసిటీ ప్రకారం, రోజువారిగా టార్గెట్ పూర్తి చేసేలా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్లతో కలిసి రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లు, పౌర సరాఫరాల శాఖ అధికారులతో సీఎంఆర్ వానాకాలం, యాసంగి(2022-23)పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకొని మిల్లింగ్ చేయకుండా ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వకపోవడానికి గల కారణాలను మంత్రి సమీక్షించారు. డిసెంబర్ 31 వరకు రాష్ట్రం నుంచి దాదాపు 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉందని, తద్వారా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు ఆగిపోయాయనిచ వెంటనే అందించాలని కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఎస్వో స్వామి కుమార్, డీఎం సివిల్ సప్లయ్ బాలరాజ్, జిల్లా మారెటింగ్ శాఖ అధికారి నాగమణి పాల్గొన్నారు.