అచ్చంపేట, ఫిబ్రవరి 15 : రైతులు రోడ్లపైకి వచ్చి మద్దతు ధర కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, రైతుల పక్షాల ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. గు రువారం ఆయన సృగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అచ్చంపేటలో రైతు లు వారం రోజులుగా మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్నా పట్టించుకునే వారు లేరని, ఎమ్మెల్యే వంశీకృష్ణ నేటి వరకు కూడా పలకరించలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మద్దతు ధర కల్పించి ఆదుకున్నామని, మార్కెట్లో ఇబ్బందిపడకుండా రైతులకు అన్నం కూడా పె ట్టించామని అన్నారు. మహిళా ప్రజాప్రతినిధిపై దాడి చేసేస్థాయికి ఆందోళన చేరిందంటే రైతులు ఎంత రగిలిపోతున్నారో గ్రహించాలన్నారు. దాడికి పాల్పడిన వారి ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించా రు. రైతులకు మద్దతు ధర కల్పించకుండా కాంగ్రెస్ తప్పించుకునే ధోరణి అవలంభిస్తుందన్నారు.
రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన హామీ ఏ మైందని గువ్వల ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా గొంతుకొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నా రు. వందరోజుల గడువు తర్వాత ప్రజా సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యమిస్తామన్నారు. కేవలం బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాతరగా మేడిగడ్డకు వెళ్లారని, ప్రభుత్వ ఖాజానాను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేక అసెంబ్లీకి రాకుంటే సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ సాధించిన ఉద్యమనేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ చేతగానితనం వల్ల తెలంగాణ చీకటిగా మారే ప్రమాదం ఉందన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ రాం బాబు, అమీనొద్దీన్, కౌన్సిలర్ రమేశ్రావు, రమేశ్, వైస్ఎంపీపీ నారాయణ, నాయకులు ప్రవీణ్, బాలరాజు, కుతుబుద్దీన్, శ్రీరామ్, శంకర్మాదిగ, సురేశ్, శివ, మక్బూల్, శ్రీశైలం, రాజు, బాలరాజు పాల్గొన్నారు.