అమరచింత, అక్టోబర్ 30 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, సబ్బండ వర్గాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షకుడు అంజనేయులుగౌడ్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలు చిట్టెం సుచరితరెడ్డితో కలిసి సోమవారం పట్టణంలోని జమ్ములమ్మ ఆలయం ఆవరణలో బీఆర్ఎస్ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఆ పార్టీ నాయకులకే గ్యారెంటీ లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. నవంబర్ 6న మక్తల్లో నిర్వహించే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణంగౌడ్, అమరచింత మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, అమరచింత జెడ్పీటీసీ మార్క సరోజ, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి తదితరులుపాల్గొన్నారు.
మండలంలోని మిట్టనందిమల్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మహేందర్, అలాగే బీజేపీ కార్యకర్తలు, సీపీఐ కార్యకర్త దేవరాజు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.