ప్రగతి సారథి, సీఎం కేసీఆర్ ఆదివారం పాలమూరుకు రానున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయగా.. క్రీడా శాఖ మంత్రి పనులను పర్యవేక్షించారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా, పాలకొండ సమీపంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఎంవీఎస్ కళాశాల గ్రౌండ్లో బహిరంగ సభ జరగనున్నది. జనసమీకరణలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులు నిమగ్నమయ్యారు. పాలమూరు పట్టణం బ్యానర్లు, జెండాలు, కటౌట్లతో గులాబీమయంగా మారింది. నూతన కలెక్టరేట్ విద్యుద్దీపాల కాంతుల్లో మిరిమిట్లు గొల్పుతున్నది.
మహబూబ్నగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పా లమూరు.. గులాబీమయంగా మారిం ది. సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందు కు జిల్లా కేంద్రం ముస్తాబైంది. అటు జడ్చర్ల నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు.. ఇటు భూ త్పూర్ నుంచి కలెక్టరేట్ వరకు ఎక్కడ చూసి నా భారీ కటౌట్లు, బ్యానర్లు, గులాబీజెండాలు రెపరెపలాడుతున్నాయి. జంక్షన్ల వద్ద భారీఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలిశా యి. పాలకొండ సమీపంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్తోపాటు జి ల్లా పార్టీ కార్యాలయాన్ని ఆదివా రం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
అనంతరం ఎంవీఎస్ డి గ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్ర సంగించనున్నారు. కాగా, సభకు ఉమ్మడి జిల్లా నుం చి భారీ ఎత్తున జనాన్ని సమీకరించాలని పార్టీ నే తలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీవినీ ఎరుగని రీతి లో సభను విజయవంతం చేసేందుకు మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు సీ.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎ మ్మెల్యేలు కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించా రు.
మహబూబ్నగర్, రూరల్, హన్వాడ మండలా ల నుంచి భారీ ఎత్తున జనాన్ని తరలించేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ వార్డులు, గ్రామాలకు ఇన్చార్జిలకు అప్పగించారు. ఎమ్మెల్యే ఆల ఆధ్వర్యంలో భూత్పూర్ నుంచి సభ వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. పాలమూరు సభ చారిత్రాత్మకంగా మారనున్నదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా, సీఎం పర్యటన సందర్భంగా ఐజీ కమలహాసన్రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
పాలకొండ వద్ద 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను అందంగా ముస్తాబుచేశా రు. సీఎం కేసీఆర్ శిలఫలాకం ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ చాంబర్ను ప్రారంభించనునారు. అ నంతరం కలెక్టర్ వెంకట్రావుకు పరిపాలన పగ్గాలు అప్పజెప్పనున్నారు. మొదటి అంతస్తులోనిస్టేట్ చాంబర్లో ఏర్పాటు చేసిన మంత్రి కార్యాలయాన్ని ప్రారంభించాక.. గ్రౌండ్ఫ్లోర్లో ఉన్నతాధికారులతో జిల్లాలోని అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. కలెక్టరేట్లో కలియతిరిగి పరిసరాలను పరిశీలించనున్నారు.
భవనం మొత్తం అడుగడుగునా పోలీసు ల భద్రత ఏర్పాటు చేశారు. మీడియా, వీఐపీలను గ్యాలరీలకే పరిమితం చేయనున్నారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ము ఖ్యనేతలను మాత్రమే లోపలికి అనుమతించనున్నా రు. కొందరు ఉద్యోగులకు మాత్రమే పాసులు జారీ చేశారు. అలాగే జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆనుకొని సువిశాల స్థలంలో ని ర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రా రంభించనున్నారు. ఈ మేరకు నాయకులు ఆఫీస్ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు.
జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. జిల్లాకు చెందిన 800, అదనంగా మరో 1,300 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ఐజీ క మల్హాసన్రెడ్డి నేతృత్వంలో ఎస్పీలు వెంకటేశ్వర్లు, మనోహర్, రంజన్త్రన్కుమార్, కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు అడిషనల్ ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 53 మంది సీఐలు, 138 మంది ఎ స్సైలతోపాటు 1200 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధుల్లో ఉండనున్నారు.