PRLI | నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ)/కొల్లాపూర్, మే 5 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకోనున్నాయి. సచివాలయం లో జరిగిన మొదటి సమీక్షలో జూలై నాటికి కరివెన జలాశయానికి నీళ్లు అందించాలని సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. త రచూ క్షేత్ర పర్యటనలు చేపట్టాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులకు ఆదేశించారు. దీం తో జూలై నాటికి కరివెనకు నీటిని తరలించడమే ల క్ష్యంగా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తోపాటు సీఎం సలహాదారు స్మితాసబర్వాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం ప్రా జెక్టు పనులను సందర్శించనున్నారు.
దక్షిణ తెలంగాణకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వరప్రదాయినిగా మారనున్నది. సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాక రూ.35వేల కోట్ల బడ్జెట్తో 2015, జూన్ 11న కేసీఆర్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. కొల్లాపూర్ వద్ద కృష్ణా నది నుంచి 70టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఉమ్మడి పాలమూరులో 7లక్షల ఎకరాలకు, రంగారెడ్డిలో 2.7లక్షల ఎకరాలకు, నల్లగొండలో 0.3లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈక్రమంలో ధరల నేపథ్యంలో రూ.50వేల కోట్లకు నిర్మాణ వ్యయం పెరిగింది. ఈ నిధులతో నార్లాపూర్(కొల్లాపూర్), ఏదుల(గోపాల్పేట), వ ట్టెం(బిజినేపల్లి), కరివెన(భూత్పూర్), ఉదండాపూర్(జడ్చర్ల), లక్ష్మీదేవిపల్లి(షాద్నగర్)లో జలాశయా లను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూ ర్తిచేసేందుకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చే స్తుండగా ప్రతిపక్షాలు కేసులు వేస్తూ పనులను ఆ పేందుకు కుట్రలు పన్నుతున్నాయి.
దీంతో లక్ష్యం మేర పనులు పూర్తి కాలేకపోయాయి. సీఎం ఆదేశాలతో ప్రభుత్వం, ఇరిగేషన్శాఖ అధికారులు ఈ కుట్రలను ఛేదిస్తూ పనులను పూర్తిచేసేందుకు నిరంత రం శ్రమిస్తున్నారు. ఇలా కొన్నాళ్లుగా పీఆర్ఎల్ఐ పనుల్లో వేగం పెరిగింది. ఏదుల జలాశయం ఇప్పటికే పూర్తికాగా మూడు పంపులు నీటిని విడుదల చే సేందుకు సిద్ధమయ్యాయి. నార్లాపూర్ నుంచి నీళ్లు రావడమే ఆలస్యం.. పంపుల నుంచి వట్టెంకు కృష్ణ మ్మ పరుగులు పెట్టనున్నది. ఇందుకోసం నార్లాపూర్లో ఓ పంపును సిద్ధం చేసి జూలై చివరి నాటికి ప్రారంభించేలా ఇంజినీర్లు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో నార్లాపూర్-ఏదుల మధ్య 16కి లో మీటర్ల టన్నెల్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. కాగా ఏదుల-వట్టెం మధ్య 27కిలోమీటర్ల కుడి టన్నెల్ పనులు పూర్తయ్యాయి. నార్లాపూర్ పంపు ప్రారంభమైతే ఏదుల నుంచి రెండు పంపుల ద్వారా వట్టెం జలాశయానికి నీళ్లను తరలించనున్నారు. ఇందుకు సంబంధించి కాల్వ పనులు దాదాపు పూర్తయ్యాయి. వట్టెం వద్ద ఇప్పటికే 2పంపులు సిద్ధంగా ఉన్నాయి. ఇలా జిల్లాలోని నార్లాపూర్, వట్టెం రిజర్వాయర్ల పనులు తుది దశకు చేరాయి. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశిస్తూ సచివాలయంలో నిర్వహించిన తొలి సమీక్షలో అధికారులకు లక్ష్యం విధించారు. జూలై నాటికి కరివెనకు నీటిని తరలించాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన తాగునీటి కాంపోనెంట్ పనులు కాళేశ్వరం తరహాలో చేపట్టాలని సూచించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు రెండువారాలకోసారి ప్రాజెక్టు పనులను సందర్శించాలన్నారు. జూలై వరకు కరివెనకు, ఆగస్టు నాటికి ఉదండాపూర్కు నీటిని ఎత్తిపోసేలా టార్గెట్ ఇచ్చారు. దీంతో రాష్ట్ర మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, సీఎం సలహాదారు స్మితా సబర్వాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ఈఎన్సీ మురళీధర్రావు, ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డి శనివారం ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. ఉదయం నార్లాపూర్, మధ్యాహ్నం ఏదుల, సాయంత్రం వట్టెం రిజర్వాయర్లను సందర్శిస్తారు. ప్రాజెక్టు పనుల్లో జరిగిన ప్రగతితోపాటు జూలై నాటికి ప్రాజెక్టు పంపులు ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షిస్తారు. మొత్తంగా రెండు, మూడునెలల్లో పాలమూరు-రంగారెడ్డి ఫలాలు ఉమ్మడి పాలమూరు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
పర్యటన వివరాలు ఇలా..
* ఈ బృందం శనివారం ఉదయం 9గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నార్లాపూర్ రిజర్వాయర్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పంపింగ్ స్టేషన్, నార్లాపూర్, ఎల్లూరు రిజర్వాయర్లు, ఓపెన్ కెనాల్, టన్నెల్ను పరిశీలించనున్నారు.
* మధ్యాహ్నం 12 గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి బయలుదేరి 12:30గంటలకు ఏదుల రిజర్వాయర్కు చేరుకుంటారు. రోడ్డుమార్గంలో పంపింగ్ స్టేషన్, రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం ఆన్గోయింగ్ ప్రాజెక్టు పనులపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు.
* 2:30 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 3గంటలకు వట్టెం రిజర్వాయర్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా వట్టెం రిజర్వాయర్, మిషన్ భగీరథ పనులను, బిజినేపల్లి-జడ్చర్ల ప్యాకేజీ 12 కెనాల్ పనులను పరిశీలిస్తారు.
* సాయంత్రం 4గంటలకు వట్టెం రిజర్వాయర్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 4:45గంటలకు హైదరాబాద్కు చేరుకుంటారని మంత్రి సింగిరెడ్డి ప్రైవేట్ కార్యదర్శి సాయిబ్రిందా శుక్రవారం షెడ్యూల్లో పేర్కొన్నారు.
వెంకటాద్రి రిజర్వాయర్ సందర్శన
బిజినేపల్లి, మే 5 : మండలంలోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ను ఉన్నతాధికారు లు, రాష్ట్ర మంత్రులు శనివారం సందర్శించనున్నారు. ప్రధానంగా సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ మురళీధర్రావు, లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వయిజ ర్ పెంటారెడ్డి, నాగర్కర్నూల్ చీఫ్ ఇంజినీ ర్ అమీద్ఖాన్, మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ రాములు సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించి హెలిప్యాడ్ను సిద్ధం చేయగా తాసీల్దార్ అంజిరె డ్డి ఏర్పాట్లను శుక్రవారం పర్యవేక్షించారు.
సీఎం ఆదేశాలతో క్షేత్ర సందర్శనలు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను మంత్రులు, ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఓఎస్డీ, ఇరిగేషన్ శాఖ అధికారులు శనివారం సందర్శిస్తారు. జూలై వరకు కరివెనకు, ఆగస్టు నాటికి ఉదండాపూర్కు కృష్ణా జలాలు తరలించేలా పనుల్లో వేగం పెంచాం. జూలైలో నార్లాపూర్లో ఒక పంపును ప్రారంభించి, ఏదులకు నీటిని తరలిస్తాం. ఏదులలో మూడు పంపులు సిద్ధంగా ఉండగా.. వట్టెంలో రెండు పంపులు రెడీగా ఉన్నాయి. మరో మూడు నెలల్లో కృష్ణా జలాలు పాలమూరు భూముల్లో పారేలా చర్యలు తీసుకుంటున్నాం.
– సత్యనారాయణగౌడ్, డీఈ