ఆత్మకూరు, నవంబర్ 2 : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పరి పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ మక్తల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఆపార్టీ మండల ముఖ్యనాయకులు, బూత్ కమిటీల ప్రతినిధులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. తెల్లరేషన్కార్డు కలిగిన పేద కుటుంబాలకు రూ. 5లక్షల బీమా పథకాన్ని బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందన్నారు. సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలు ప్రతినెలా రూ. 3వేలు, అన్నపూర్ణ ద్వారా సన్నబియ్యం, రూ.400లకే గ్యాస్ సిలిండర్తో పాటు రైతుబంధును ఐదేండ్లలో రూ. 16వేలు పెంచడం ఇలా కులమతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు గ్రామాల్లోకి వస్తారని, ఇన్నాళ్లు వారు ఏం చేశారని నిలదీయాలన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్షని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏనాడూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఓట్ల కోసమే ఆ పార్టీలు ప్రజల్లోకి వస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో ఆత్మకూరుకు తప్పక పూర్వవైభవం వస్తుందన్నారు. రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను తప్పక నెరవేరుస్తానని హామీనిచ్చారు. ఈనెల 6న మక్తల్ నియోజకవర్గ కేంద్రానికి సీఎం కేసీఆర్ రానున్నారని, ఆ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ కార్యకర్తలు ఎన్నికలు పూర్తయ్యేవరకు సైనికుడిలా పనిచేయాలన్నారు. అనంతరం మూలమల్లలో నిర్వహిస్తున్న పాండురంగస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్యాదవ్, ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, జెడ్పీటీసీ శివరంజని, పీఏసీసీఎస్ అద్యక్షులు గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీ యాదవ్, వైస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, మాజీ ఎంపీపీ మొగిళి శ్రీధర్గౌడ్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.