మక్తల్ రూరల్, జనవరి 10 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యురాలు చిట్టెం సుచరితారె డ్డి అన్నారు. మండలంలోని జౌళాపూర్ సర్పంచ్ ప్రతాప్రెడ్డి ఆ ధ్వర్యంలో రైతుబంధు సంబురాలు సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ 8 విడుతలుగా ప్రతి ఏటా వానకాలం, యాసంగి పంటలు సాగుబడి చేసు కోవడానికి ఎకరానికి రూ.10వేల చొ ప్పున రైతుల బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశంలోనే ఏ సీఎం చేయని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచి సం క్షమం కోసం అనేక పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని వెల్లడించారు. ఏ గ్రామానికి వెళ్లినా రైతుబంధు వారోత్సవాలను రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పండుగ మాదిరి గా నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆ మె హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆమె ఎద్దుల బండి పై ఎక్కి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషే కం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, ఎంపీటీసీ నర్సిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రె డ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రాంలింగం, రై తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు బహుమతుల ప్రదానం
రైతుబంధు వారోత్సాలను పురస్కరించుకొని విద్యార్థులు ని ర్వహించిన రంగవల్లులు పలువురిని ఆకట్టుకున్నాయి. చిట్టెం సుచరితారెడ్డి ముగ్గుల పోటీలను పరిశీలించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.
మండలంలో ట్రాక్టర్ ర్యాలీ
కృష్ణ, జనవరి 10 : మండలకేంద్రంలో సోమవారం నిర్వ హించిన రైతుబంధు వారోత్సవాల కార్యక్రమానికి రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యురాలు సుచరితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంతకుముందు ట్రాక్టర్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణిమ, జెడ్పీటీసీ అంజనమ్మ, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచ్ రాధామహదేవ్, టీఆర్ఎస్ కృష్ణ, మాగనూర్, మక్తల్ మండలా ల అధ్యక్షులు విజయప్పగౌడ్, ఎల్లారెడ్డి, మహిపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల యువ నాయకుడు శివరాజ్పాటిల్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివప్ప, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో..
దామరగిద్ద, జనవరి 10 : మండలకేంద్రంతోపాటు కానుకు ర్తి, అన్నాసాగర్ తదితర గ్రామాల్లో రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వహించారు. కానుకుర్తి, అన్నాసాగర్ గ్రామాల్లో రై తులు ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, పీఏసీసీఎస్ చైర్మన్ ఈదప్ప, మండల వ్యవసాయాధికారి అరవింద్, సోషల్ మీడి యా నాయకుడు అంజి పుట్టి, నాయకులు పాల్గొన్నారు.
ఉత్తమ రైతులకు సన్మానం
మరికల, జనవరి 10 : మండలకేంద్రంలో సోమవారం రైతుబంధు సంబురాలను వివిధ గ్రామాల్లో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తమ రైతులను వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
రైతన్నల సంబురాలు
రైతుబంధుతో రైతుల కష్టాలు తీర్చడంతో రైతన్నలు రైతుబం ధు సంబురాలను ఘనంగా జరుపుకొన్నారు. మండలంలోని పెద్దచింతకుంట, పుసాల్పహాడ్, మరికల్ రైతు వేదికల్లో రైతులు సంబురాలను నిర్వహించి ముగ్గులు వేసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పేట జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, రైతుబం ధు మండల కో ఆర్డినేటర్ సంపత్కుమార్, సర్పంచ్ గోవర్ధన్, ఎంపీటీసీ సుజాత, పీఏసీసీఎస్ చైర్మన్ రాజేందర్గౌడ్, అధికారులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పథకాలను మోదీ కాపీ కొట్టారు
కోస్గి, జనవరి 10 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ కాపీ కొట్టారని కొడంగల్ ఎ మ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని ముక్తిపా డ్ రైతువేదికను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను ఏకం చేసి పండించే పంటలపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ పథకం వస్తుందని దేశ ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో 60 మందికి కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను అందజేశారు. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ‘రైతుబంధు’
కొడంగల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వహించారు. పలువురు రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం పల్లవి సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రంగురంగుల ముగ్గులతో వేసి పలువురిని అలరించింది. ఆమెను ఎమ్మెల్యే అభినందించారు.
పీఏసీసీఎస్కి స్థలం కేటాయింపు
పీఏసీసీఎస్ కార్యాలయానికి ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలా న్ని మంజూరు చేసిందని పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చొరవతో కలెక్టర్ మండలంలోని కడంపల్లి గ్రామ శివారులో 71 సర్వే నంబర్లో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని భీంరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మంత్రెడ్డి, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఆయాగ్రామా ల సర్పంచులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
ఊట్కూర్, జనవరి 10 : రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభు త్వం పని చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అ న్నారు. మండలకేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సో మవారం నిర్వహించిన రైతుబంధు సంబురాలకు ఎమ్మెల్యే చి ట్టెం, డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆద ర్శ రైతులను స్థానిక సింగిల్విండో కార్యాలయం వద్ద సన్మానించారు. రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు ని ర్వహించి బహుమతులను అందజేశారు. రైతుబంధు సంబురా ల్లో భాగంగా ఎమ్మెల్యే ట్రాక్టర్ నడుపుతూ రైతులను చైతన్యపరిచారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఏవో గణేశ్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అ రవింద్కుమా ర్, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి, దంతన్పల్లి, ఊట్కూర్ రైతుబంధు స మితి అధ్యక్షులు చంద్రశేఖర్రెడ్డి, శివరామరాజు, మండల కోఆప్షన్ సభ్యుడు అ బ్దుల్ రహిమాన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్గౌడ్, శంకర్రెడ్డి, ఖాన్, గోవిందప్ప, ఆనంద్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, జయప్రకాశ్రెడ్డి, మహేశ్రెడ్డి పాల్గొన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
నారాయణపేట, జనవరి 10 : రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భాస్కరకుమారి, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతుబంధు వేడుకలు అంబరాన్నంటాయి. మార్కెట్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పలువురు రైతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జగదీశ్, జెడ్పీటీసీ అంజలి, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, కౌన్సిలర్ రాజేశ్వరి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, మార్కెట్ కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
గ్రామాల్లో సంబురాలు
నారాయణపేట రూరల్, జనవరి 10 : మండలంలోని జా జాపూర్, కోటకొండ, చిన్నజట్రం, పేరపళ్లతోపాటు తదితర గ్రా మాల్లో రైతుబంధు సంబురాలను రైతులు ఘనంగా నిర్వహించారు. జాజాపూర్లో రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఎండ్ల బండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు జె డ్పీటీసీ అంజలి బహుమతులు అందజేశారు. బహుమతుల ను వార్డు సభ్యుడు నారాయణరావు సహకరంతో అందజేశారు. కో టకొండ, పేరపళ్ల గ్రామాల్లో రైతులు, నాయకులు ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సీఎం కేసీఆర్, ఎమ్మె ల్యే ఎస్ఆర్రెడ్డి చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకం చేశారు. కా ర్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షు డు రాములు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వెంకట్రాములుగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీ శేఖర్, నాయకులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.
దేశానికి ఆదర్శం సీఎం కేసీఆర్ పాలన
నర్వ, జనవరి 10 : రైతు సంక్షేమ అభివృద్ధి ప్రథమ లక్ష్యం గా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. డీసీసీబీ చైర్మన్ నిజాంపాషాతో కలిసి మండలంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాలు, ఎద్దుల బండ్లు ర్యాలీ, కందుల కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హా జరై మాట్లాడారు. మండలంలో కంది పంటను పండించిన రై తుల కోసం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని, ఇక్కడ రూ.6,300 మద్దతు ధరతో రైతులు తమ పంటను విక్రయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, సింగిల్విండో చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మణ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు చిన్నయ్య, విండో డైరెక్ట ర్లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చిత్రపటాలకు క్షీరాభిషేకం
ధన్వాడ, జనవరి 10 : రైతుబంధు సంబురాల్లో భాగంగా మండలకేంద్రంలో సీఎం కేసీఆర్, పేట ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి చిత్రపటాలకు సోమవారం రైతులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డి, సర్పంచ్ అమరేందర్రెడ్డి, నాయకులు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.