చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు మిషన్ కాకతీయ పథకంతో సీఎం కేసీఆర్ చెరువులకు పునర్జ్జీవం పోయడంతో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా సాగు చేపట్టడంతో బీడు భూములు పచ్చని పైరత్లో కళకళలాడుతున్నాయి. అంతే కాకుండా మత్స్యకారులు సైతం చెరువుల్లో చేపపిల్లల పెంపకం చేపట్టి ఉపాధి పొందుతున్నారు. శ్రీరంగాపురం మండలంలో రంగసముద్రం, రామసముద్రం రెండు చెరువులను పునరుద్ధరించి 2,380ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారు. చెరువులు, కుంటల్లో నీరు పుషలంగా ఉండడంతో ఆయకట్టు రైతులే కాకుండా భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల కింద వ్యవసాయం చేసుకుంటున్న కర్షకులు సైతం సాగును సంబురంగా చేసుకుంటున్నారు.
శ్రీరంగాపురం, అక్టోబర్ 20: గత సమైక్య పాలకుల వివక్ష స్థానిక నాయకులు అధికారకాంక్ష వెరసి వనపర్తి నియోజకవర్గం రైతుల బతుకులు ఆగమాగం అయ్యాయి. ఉమ్మడి పాలమూరు నుంచి జీవనదులు పారుతున్న పంటచేయులకు నీరు రాక బీడు భూములుగా ఉండేవి. రైతులు నమ్ముకున్న నేలను వదలలేక పంటలు పండించేందుకు సాగునీరు అందక అప్పుల బాధలు తట్టుకోలేక ఉన్న ఊరిని కన్నవారిని వదిలి పొట్ట చేత పట్టుకొని రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేవారు. గదంతా గతం ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ వనపర్తి నియోజకవర్గం లో మంత్రి నిరంజన్ రెడ్డి కృషితో నేడు బీడు భూముల్లో కృష్ణమ్మ పరవళ్ళు తొకుతున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సీఎం కేసీఆర్ వ్వవసాయానికి పెద్ద పీట వేశారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను, కుంటలను పూడిక తీయించి జూరాల కాలువల ద్వారా నీటిని నింపారు. పెట్టుబడి కోసం రైతులు ఆసాములపై ఆధారపడకుండా రైతుబంధుతో ఆర్థిక సాయం అందించారు. వలస వెళ్లిన రైతులు, రైతు కూలీలు తిరిగొచ్చి గ్రామాల్లో సంతోషంగా వ్వవసాయం చేసుకుని జీవనం గడుపుతున్నారు. శ్రీరంగాపురం మండలంలోని రంగసముద్రం, రామసముద్రం చెరువులను పునరుద్ధరించి 2,380 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారు. ఈ రెండు చెరువుల కింద 2,380 ఎకరాలు సాగులోకి రావడమే కాకుండా ప్రభుత్వ ఉచితంగా చేపపిల్లల పంపిణీతో మత్స్యకారులకు చేతినిండా పని, ఆదాయం లభించింది. చెరువుల్లో కుంటల్లో నీరు పుషలంగా ఉండడంతో ఆయకట్టు రైతులే కాకుండా భూగర్భజలాలు పెరిగి బోరు బావుల కింద వ్యవసాయం చేసుకుంటున్న రైతులు కూడా వ్యవసాయాన్ని సంబరంగా చేసుకుంటున్నారు. గ్రామాల్లో సాగు, తాగునీటి కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి గ్రామంలో ఎటుచూసినా పచ్చని పంట పొలాలు కళకళాడుతున్నాయి.
మండల కేంద్రంలోని చెరువును రిజర్వాయర్ గా ఏర్పాటు చేసినప్పటి నుంచి. నీళ్లు పుషలంగా ఉంటున్నాయి. రిజర్వాయర్లో చేపలవృత్తికి ఎంతో మేలు జరిగింది. మత్స్యకారులకు చేతినిండా పని ఆదాయం ఉండడంతో కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు జీవనోపాధి కల్పించింది. మిషన్ కాకతీయ, రైతుబంధు పథకాలు రైతులకు ఎంతో మేలు చేశాయి. సాగునీరు పుషలంగా ఉండడంతో రైతులు ధీమాగా వ్యవసాయం చేస్తున్నారు. వ్వవసాయానికి పెట్టుబడి సాయం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.