కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నది. పోలింగ్కు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. అన్ని సెగ్మెంట్లలో క్యాంపేయిన్ జోరుగా సాగుతున్నది. మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తోపాటు ఎమ్మెల్యేలు బాలరాజు, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, జైపాల్ యాదవ్, రాజేందర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, అలంపూర్ అభ్యర్థి విజయుడు పాల్గొంటున్నారు. ఓ వైపు నిత్యం సమావేశాలు, రోడ్ షోలతో అభ్యర్థులు దూసుకెళ్తుండగా.. మరోవైపు గులాబీ పార్టీ శ్రేణులు పల్లె, పట్నం అన్న తేడా లేకుండా గడపగడపనూ టచ్ చేస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతోపాటు మ్యానిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే 13 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతమయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మక్తల్లో నిర్వహించిన రోడ్షోకు నీరా‘జనం’ లభించిందిఎన్నికలు సమీపిస్తున్నా ఇతర పార్టీల నుంచి వలసల పరంపర మాత్రం ఆగడం లేదు. ఆయా కుల సంఘాలు, పల్లెలు స్వచ్ఛందంగా మద్దతు పలుకున్నాయి. కారు స్పీడ్ను అందుకోలేక విపక్షాలు మాత్రం బేజారెత్తుతున్నాయి.
మహబూబ్నగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది ఉమ్మడి జిల్లాలో ప్రచార పర్వం జోరుగా సాగుతున్నది. అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కారు స్పీడ్ అందుకుంది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు పెరుగుతుండడంతో వారు వన్సైడ్గా కనిపిస్తున్నది. కేసీఆర్ సర్కార్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఎన్నికల్లో గెలిస్తే అమలు చేసే కొత్త పథకాలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. భారీ ర్యాలీలు, డప్పులు, డోలు, గజమాలతో పార్టీ అభ్యర్థులకు ఘనస్వాగతం పలుకుతున్నారు. పోలింగ్కు ఇంకా మూడు రోజుల సమయమే ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీ నుంచి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కారు స్పీడ్ పెరగడంతో కాంగ్రెస్, బీజేపీలు పరేషాన్ల పడ్డాయి. సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అందుకున్న వారంతా కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించేందుకు సన్నద్ధమవుతున్నారు. గులాబీ సైనికులు ఊరువాడ ఏకమై పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. మరోసారి హ్యాట్రిక్ సర్కార్ పక్కా అని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీశ్రేణులు ధీమాతో ఉన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈసారి ఎలక్షన్ ట్రెండ్ వన్సైడ్గా కనిపిస్తోంది. 13నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. 2018 ఎన్నికలే మళ్లీ పునరావృతం అవుతున్నాయని పార్టీ నేతలు జోష్యం చెబుతున్నారు. అదే జోష్ 2023లో కూడా కొనసాగిస్తామని పార్టీశ్రేణులు ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో 14స్థానాల్లో 13 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడడంతో షాద్నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో కలిసిపోయింది. దీంతో మిగిలిన 13నియోజకవర్గాల్లో గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఇప్పుడు పట్టణాల్లో భారీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా జనం వస్తుండడంతో పార్టీలో జోష్ పెరుగుతుంది. కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో దూకుడు పెంచారు. విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో ఈసారి హ్యాట్రిక్ విజయం ఖాయమని అంటున్నారు.
మహబూబ్నగర్ నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014, 18 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిని ఓడించి అత్యధిక మెజారిటీని కైవసం చేసుకున్నారు. 2023లో కూడా మళ్లీ పాత ప్రత్యర్థుల మధ్యన పోటీ నడుస్తోంది. రాత్రికి రాత్రి పార్టీలు మారి కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకున్న యెన్నం శ్రీనివాస్రెడ్డితో తలపడుతున్నారు.
అనుకూల అంశాలు: మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.3వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా మారాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కలిసి వస్తున్నాయి.
వనపర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి నిరంజన్రెడ్డి రెండోసారి పోటీ చేస్తున్నారు. 2014లో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా ఉండి జిల్లా ను సాధించారు. 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అనుకూల అంశాలు: వనపర్తి జిల్లాలో మినీ లిఫ్ట్లని ఏర్పాటు చేసి సాగునీరు అందించారు. జిల్లాలో అనేక విద్యాసంస్థలను నెలకొల్పారు. వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక సంక్షేమ పథకాలను జిల్లాలో అమలు చేశారు.
ఇప్పుడు అందరి దృష్టి కొడంగల్ నియోజకవర్గంపై ఉంది. నారాయణపేట జిల్లాలోని మద్దూరు, కోస్గి, కొత్తపల్లి, గుండుమాల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. టీపీసీసీ అధ్యక్షుడిని తొడగొట్టి ఓడించిన పట్నం నరేందర్రెడ్డి మళ్లీ రెండోసారి పోటీ చేస్తున్నారు.
అనుకూల అంశాలు: నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేశారు. కొడంగల్, కోస్గి పట్టణాల్లో వంద పడకల దవాఖాన, కోస్గికి బస్ డిపోను తీసుకొచ్చారు. మహబూబ్నగర్-చించోలి రహదారిని జాతీయ రహదారిగా మార్చారు. కొత్త మండలాలను సాధించారు.
నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా చిట్టెం రామ్మోహన్రెడ్డి మూడోసారి పోటీ చేయబోతున్నారు. 2014, 2018లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.
అనుకూల అంశాలు: నియోజకవర్గంలో ఏకంగా మూడు మున్సిపాలిటీలను సాధించి రూ.కోట్లతో అభివృద్ధి చేపట్టారు. మక్తల్లో 150 పడకల దవాఖాన, కొత్తగా రైల్వేస్టేషన్, జాతీయ రహదారి, ఫైర్స్టేషన్ సాధించారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సాగు విస్తీర్ణం ఇక్కడే.
అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయుడు పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ప్రధాన ఆనచరుడుకి టికెట్ ఇవ్వడంతో తానే భుజస్కంధాలపై వేసుకొని ముందుకు సాగుతున్నారు.
అనుకూల అంశాలు: అలంపూర్లో వంద పడకల దవాఖాన, తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్కు సాగునీరు, తుంగభద్రానదిపై అలంపూర్-నందిన్నె బ్రిడ్జిలు, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు
నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణమోహన్రెడ్డి రెండోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఏకంగా డీకే అరుణను మట్టి కరిపించారు. ఆ దెబ్బకు ఈసారి ఆమె పోటీ నుంచి తప్పుకొన్నారు.
అనుకూల అంశాలు: గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ఏర్పాటు, మెడికల్ కాలేజీ మంజూరు, 2వేల డబుల్ బెడ్రూం ఇండ్లు, నర్సింగ్ కాలేజ్ మంజూరు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎస్.రాజేందర్రెడ్డి మూడోసారి పోటీ చేయబోతున్నారు. బీజేపీకి కంచుకోటల భావిస్తున్న, కాంగ్రెస్ అభ్యర్థిని మార్చిన బీఆర్ఎస్ను తట్టుకునే శక్తిలేదు.
అనుకూల అంశాలు: నారాయణపేట జిల్లా కేంద్రం ఏర్పాటు కావడం.. ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం.. జిల్లాకు కొత్తగా మెడికల్ కాలేజీ ఏర్పాటు.. నారాయణపేటలో ఎన్నో ఏండ్లుగా విస్తరణకు నోచుకోని రహదారుల
ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆల వెంకటేశ్వర్రెడ్డి మూడోసారి పోటీ చేయబోతున్నారు. ఆల ధాటికి కాంగ్రె స్, బీజేపీలో అభ్యర్థులను మార్చినా ప్రయోజనం శూన్యం.
అనుకూల అంశాలు: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా అతిపెద్ద కరివేన రిజర్వాయర్ ఏర్పాటు.. నియోజకవర్గంలో వాగులపై 30 చెక్డ్యాంల నిర్మాణం.. కోయిల్సాగర్, సరళసాగర్, రామన్పాడు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడం.. కేఎల్ఐ కాల్వ ద్వారా కందూరు వాగుకు కృష్ణా జలాలు పారించడం.
జడ్చర్ల నియోజకవర్గంలో నుంచి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేయబోతున్నారు. గతంలో తెలంగాణ సాధన కోసం రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యేగా చరిత్రకెక్కారు.
అనుకూల అంశాలు: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కీలకమైన ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. పారిశ్రామికంగా, రియల్ ఎస్టేట్పరంగా, వాణి జ్య కేంద్రంగా జడ్చర్లను మార్చారు. వందపడకల దవాఖాన, నియోజకవర్గంలో 39 చెక్డ్యాంల నిర్మాణం. 44వ జాతీయ రహదారి అనుసంధానంగా రోడ్డు.. డబుల్ బెడ్రూం ఇండ్లు.
నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గువ్వల బాలరాజు మూడోసారి పోటీ చేయబోతున్నారు. గతంలో రెండుసార్లు మట్టికరిపించిన అభ్యర్థినే ఈసారి కాంగ్రెస్ పోటీలో గింపింది.
అనుకూల అంశాలు: అచ్చంపేట ఉమామహేశ్వర లిఫ్టు సాధించడం.. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వంగూరు, చారకొండ వరకు సాగునీరు తీసుకెళ్లడం.. అచ్చంపేటలో 100పడకల దవాఖాన.. రెసిడెన్షియల్ పాఠశాలలు.. జీబీఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు
నాగర్కర్నూల్ నియోజకవర్గం
నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మర్రి జనార్దన్రెడ్డి మూడోసారి పోటీ చేయబోతున్నారు. మర్రి ధాటికి కాంగ్రెస్ అభ్యర్థులను మార్చి ఈసారి కొత్తగా అభ్యర్థిని పోటీకి నిలబెట్టారు.
అనుకూల అంశాలు: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు, పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా అతిపెద్ద వట్టెం రిజర్వాయర్, మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, మినీట్యాంక్ బండ్, మెడికల్ కాలేజీ ఏర్పా టు, ఎంజీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు.
నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బీరం హర్షవర్ధన్రెడ్డి రెండోసారి పోటీ చేయబోతున్నారు. గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి కృష్ణారావును ఓడించి బీరం చరిత్ర సృష్టించారు.
అనుకూల అంశాలు: పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం.. హార్టికల్చర్ కాలేజ్ మంజూరు.. రిజర్వాయర్లు, మిషన్ భగీరథ పథకానికి ప్రధాన నీటి వనరులు ఇక్కడే కావడం..
నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జైపాల్యాదవ్ రెండోసారి పోటీ చేయబోతున్నారు. అధికార దాహంతో ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ మారిన అభ్యర్థికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టింది.
అనుకూల అంశాలు: కేఎల్ఐ ఎత్తిపోతల పూర్తిస్థాయిలో సాగునీరు.. దుందుభీ నిర్మాణం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 70వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కల్వకుర్తి, వెల్దండలో బీసీ గురుకుల ఏకలవ్య పాఠశాలలు. కల్వకుర్తిలో రెవెన్యూ డివిజన్, డీఎస్పీ కార్యాలయం. కల్వకుర్తిలో అత్యాధునిక సౌకర్యాలతో మున్సిపల్ కార్యాలయం. వంద పడకల దవాఖానకు శంకుస్థాపన.