గద్వాల/అలంపూర్, నవంబర్ 6 : గతంలో మీరు ఆశీర్వదించడం వల్లే నేను గద్వాల ఎమ్మెల్యేగా గెలిచానని నన్ను మరోసారి ఆదరించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం అయిజ రహదారిలోని తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాదసభలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో గద్వాలను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. మీ అండే నాకు కొండత ధైర్యమని మీరు ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. గతంలో చాలా సంవత్సరాలు గద్వాలను కాంగ్రెస్, టీడీపీ నాయకులు పరిపాలించారని అయితే వారి కాలంలో అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాను సాధించుకున్నామని అనంతరం గద్వాల నియోజకవర్గాన్ని విడుతల వారీగా అభివృద్ధి చేసుకుంటు వస్తున్నామన్నారు. మరో సారి మీరు ఆశీర్వదిస్తే గద్వాలను మరింత అభివృద్ధి చేస్తానని, ఈ నెల 30న జరిగే ఓటింగ్లో ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ అభ్యర్థిగా నాకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీలు ప్రతాప్గౌడ్, రాజారెడ్డి, జెడ్పీటీసీలు ప్రభాకర్రెడ్డి, పద్మావెంకటేశ్వర్రెడ్డి, శ్యామల, పీఏసీసీస్ చైర్మన్లు వెంకటేశ్, సుభాన్, సర్పంచ్ బండ్లజ్యోతి తదితరులు ఉన్నారు.
అయిజ, నవంబర్ 6 : స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు నడిగడ్డ ప్రజలను వలస జీవులుగా మార్చి గత 60 ఏండ్లుగా గద్వాలను పాలించిన కుటుంబం ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకాడడం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభంజం సృష్టించడం ఖాయమని వినియోగదారులు ఫోరం రాష్ట్ర చైర్మన్ గట్టు తిమ్మప్ప అన్నారు. నడిగడ్డలో రెండు జీవనదులు ప్రవహిస్తున్నా అన్నమో రామచంద్ర అంటూ వలసలు వెళ్లి జీవనం సాగించారన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ పాలకులన్నారు. నడిగడ్డకు సాగు, తాగునీరు అందించి సీఎం కేసీఆర్ మహానుభావుడయ్యాడన్నారు. గట్టు భీముడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నెట్టెంపాడు ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందన్నారు. నడిగడ్డను ఎండబెట్టి సీమాంధ్రకు నీళ్లు తీసుకెళ్లిన రాయలసీమ నాయకులకు హారతులు పట్టిన ఘనత మన ప్రాంతానికి చెందిన నాయకులకుందన్నారు. గద్వాలలో మతతత్వ పార్టీలకు స్థానం లేదన్నారు. గద్వాలలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు.
శంషాబాద్ ప్రాంతం నుంచి గద్వా ల తరలివచ్చిన టూరిస్టులను తరి మి కొట్టాలని ఎమ్మెల్యే సతీమణి, బూరెడ్డిపల్లి సర్పంచ్ బండ్ల జ్యోతి గద్వాల ప్రజలను కోరారు. సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యే యంగా అహర్నిశలు కష్టపడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల పట్ల ఆప్యాయత అనురాగాలు పంచుతున్న బండ్ల కృష్ణమోహన్రెడ్డిని ఆదరించాలన్నారు. పొలిటికల్ టూరిస్టులు వస్తూ.. పోతూ ఉంటారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి బురిడి కొట్టిస్తారని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మంచి నాయకుణ్ణి గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలు గొప్ప ఆదరణ పొందుతున్న బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు.
గద్వాల అర్బన్, నవంబర్ 6 : సాధారణ ఎన్నికల్లో భాగంగా సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాదసభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో హెలిప్యాడ్ వద్ద గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అదేవిధంగా హెలిప్యాడ్ నుంచి వస్తున్న సీఎం కేసీఆర్ను చూసిన నడిగడ్డ ప్రజానీకం అభివృద్ధి ప్రధాత, 24 గంటల కరెంట్ ఇచ్చిన గొప్ప వ్యక్తి అంటు నినాదాలు చేస్తు ఘనంగా స్వాగతం పలికారు.