వనపర్తి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వనపర్తిలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ వస్తున్నారు. జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహిస్తున్న భారీ సభకు ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని నాటి ఉద్యమనేత కేసీఆర్కు బాసటగా నిలిచిన సింగిరెడ్డికి ఉద్యమ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈమేరకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల శంఖారావంలో మరోసారి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విజయబావుట కోసం సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో దిశా…నిర్దేశం చేయబోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఉమ్మడి జిల్లాలో తెలంగాణ జెండాను నిరంజన్ రెడ్డి భుజాన వేసుకున్నారు. క్రమక్రమంగా ఉద్యమం బలపడిన అనంతరం అనేక మంది నాయకులు రావడం.. రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. అయితే తొలినాళ్లలో దాదాపు దశాబ్దకాలం ఒంటి చేత్తో గులాబీ జెండాను ముందుకు నడిపించిన చరిత్ర నిరంజన్ రెడ్డికే దక్కుతుంది. నాటి ఉద్యమ ప్రాధాన్యతను బట్టి సీఎం సైతం సింగిరెడ్డికి చేయూతనందించారు. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందినప్పటికీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిలో పూర్తి కాలం పని చేశారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో సింగిరెడ్డి విజయాన్ని సొంతం చేసుకొని వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఓటర్లు కట్టబెట్టిన మెజార్టీకి తగినట్లుగా రాష్ట్రంలో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. నియోజకవర్గంలోని 7మండలాల నుంచి కార్యకర్తలు, సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులను సభకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. వనపర్తి మండలంతోపాటు పెబ్బేరు, శ్రీరంగాపురం, పెద్దమందడి, ఖిల్లాఘణపురం, గోపాల్పేట, రేవల్లి మండలాల నుంచి భారీగా కార్యకర్తల తరలింపునకు ప్రణాళిక చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల నుంచి ప్రజలను సభకు రప్పించేలా పట్టణ నాయకులు,కౌన్సిలర్లకు బాధ్యతలను అప్పగించారు.
ప్రజా ఆశీర్వాద సభకు వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ తగిన ఏర్పాట్లను చేసింది. ఆయా రోడ్లను అనుసరించి ఎక్కడికక్కడ వాహనాలను పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టింది. డీఎస్పీ ఆనందరెడ్డి పర్యవేక్షణలో సభాస్థలి, అలాగే వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెబ్బేరు నుంచి వచ్చే పెద్దవాహనాలను మర్రికుంట సమీపంలో, కార్లు, ఇతర వాహనాలను బస్ డిపో వద్ద పార్కింగ్ చేయిస్తున్నారు. అలాగే గోపాల్పేట, ఖిల్లా ఘణపురం నుంచి వచ్చే వాహనాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, పెద్దమందడి నుంచి వచ్చే వాహనాలను రాజనగరం క్రాస్ రోడ్లో పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇంకా అవవసరమైతే పాత మార్కెట్ యార్డులోను వాహనాలను నిలిపే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు డీఎస్పీ ఆనందరెడ్డి వెల్లడించారు.
సీఎం కేసీఆర్ పాల్గొనే ఎన్నికల బహిరంగ సభకు జిల్లా కేం ద్రం ముస్తాబైంది. పట్ట ణ కేంద్రంలోని రోడ్లన్నీ గులాబీ జెండాలతో కళకళలాడుతున్నాయి. ప్ర ధాన కూడళ్లు, రహదారు లు గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతో కమ్ముకున్నాయి. అలాగే సభ నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ మైదానాన్ని గులాబీమయం చేశా రు. అలాగే పాలిటెక్నిక్ వెనక భాగం లో హెలీప్యాడ్ ఏర్పాట్లు చేశారు. ఒకే మైదానంలో హెలీప్యాడ్, సభ నిర్వహణ అన్నట్లుగా కనిపిస్తున్నది. దీనివల్ల సీఎం కేసీఆర్ వచ్చి వెళ్లడంలో పోలీస్ శాఖకు మార్గం మరింత సులభతరమవుతున్నది. ఇదిలా ఉంటే, సీఎం పాల్గొనే ప్రజా ఆశీ ర్వాద సభ ఏర్పాట్లను మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి వేర్వేరుగా పర్యవేక్షణ చేశారు. ఉదయం, సాయం త్రం అవసరమైన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని నాయకులు, పోలీసు అధికారులకు నిర్దేశం చేశారు.
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించాలని మంత్రి ఓటర్లకు విజ్ఙప్తి చేశారు. పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ వనపర్తిని జిల్లా చేయడంతోపాటు పెబ్బేరులో మత్స్య కళాశాల ఏర్పాటు చేశామని, 2018 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి అదనంగా నర్సింగ్, వ్యవసాయ మహిళా కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలను తీసుకొచ్చామన్నారు. సమీకృత మార్కెట్, టౌన్హాల్, వ్యవసాయ మార్కెట్, గోదాంలు, మిషన్ భగీరథ పథకం, రహదారుల విస్తరణ చేపట్టి ఐటీ టవర్ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి సింగిరెడ్డి వెల్లడించారు. 15 చెక్ డ్యాంలను పూర్తిచేసి మరో 20 చెక్ డ్యాంలకు ప్రతిపాదనలు పంపామని, నియోజకవర్గంలో లక్షా 25వేల ఎకరాలకు సాగునీరందించామన్నారు. ఈ పనులన్నీ సీఎం కేసీఆర్ తోడ్పాటునందించడం వల్లే సాధ్యమయ్యాయని, మాట ఇచ్చిన పనులన్నీ పూర్తి చేశామని వెల్లండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి అభివృద్ధికి బాసటగా నిలవాలని మంత్రి సింగిరెడ్డి విజ్ఙప్తి చేశారు..