రైతన్నల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతును రాజు చేసేందుకు అహర్నిశలు
శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కర్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రుణమాఫీని ప్రకటించి తీపి కబురును అందించారు. గురువారం నుంచి ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమై సెప్టెంబర్ రెండో వారంలోగా 45 రోజుల్లో పూర్తి కానున్నది.
ఇప్పటికే రూ.25 వేలలోపు ఉన్న వారికి మాఫీ కాగా.. ప్రస్తుతం రూ.లక్షలోపు ఉన్న రుణాలకు వర్తించనున్నది. రైతుబంధు తరహాలో అమలుకానున్నది. దీంతో రూ.లక్షలోపు అప్పు తీసుకున్న రైతులందరికీ ఊరట కలగనుండగా.. వారి మోములో
ఆనందం వెల్లివిరుస్తున్నది.
– నాగర్కర్నూల్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ)
రైతులు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయాల న్న సీఎం కేసీఆర్ ని ర్ణయం హర్షణీయం. ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని మళ్లీ నిరూపించుకున్నారు. నేను బ్యాంకులో రూ.87 వేలు రుణం తీసుకున్నాను. గిప్పుడు ఆ లోన్ను మాఫీ చేస్తాననడం సంతోషంగా ఉన్నది. నాకున్న పొలంలో హాయిగా సాగు చేసుకుంటున్నా ను. రైతులను పట్టించుకుంటున్న గిలాంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదు. సీఎం కేసీఆర్ మేలు ఎన్నటికీ మరువలేం. ప్రభుత్వం ఏ నిర్ణ యం తీసుకున్నా ప్రతిపక్షాలు ప్రజలకు తప్పుడు సమాచారమే ఇస్తున్నారు. అలాంటి వారితో రైతులు జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ సర్కారు మరో సారి విజయం సాధించడం ఖాయం.
– అల్లంపల్లి శ్రీనివాసులు, రైతు, వెల్దండ
నాగర్కర్నూల్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : రైతన్నల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిలా మారుతోన్నారు. రైతు కేంద్రీకృతంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నా లుగేళ్లుగా రైతన్నలు ఎదురు చూస్తున్న ఆ కాంక్షను తీర్చేలా రుణమాఫీ చేస్తూ ఆదేశించారు. గురువారం నుంచి రుణమాఫీ ప్రక్రియ విడతల వారీగా సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తి కానుంది. దీంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి కానున్నది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో స్వరాష్ట్రం సాధించుకున్నాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుతో గ్రామాల్లో రైతు కేంద్రంగా అభివృద్ధి వేగమందుకున్నది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటుగా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, సకాలంలో విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ కల్లాలు, వ్యవసాయ గోదాంలను నిర్మించింది. ఇందులో ప్రధానమైన రుణమాఫీ కూడా విజయవంతంగా అమలు చేయడం జరుగుతున్నది. గత 2014లో మొదటి విడుతలో రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ సీఎం కేసీఆర్ మాఫీ చేశారు. ఈ క్రమంలో 2018 లోనూ రైతులు రూ.లక్షలోపు రుణాలను తీసుకొన్నారు. ఈ రుణాల మాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రైతులు తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి తెచ్చారు. రైతుబంధు డబ్బులు పడిన సందర్భంలో, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతుంటే బ్యాంకర్లు రుణమాఫీ కోసం జమచేసుకునే చర్యలకు పాల్పడ్డారు.
ఈ విషయం తెలిసి ప్రభుత్వం మందలించింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 11 నాటికి రూ.లక్షలోపు వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.25 వేలలోపు వరకు రుణాలు మాఫీ కాగా.. రూ.25 వేల నుంచి రూ.లక్షలోపు వరకు రుణాలున్న రైతులకు గురువారం నుంచి మాఫీ కానున్నది. ఈ మాఫీతో రుణం తీరనున్నది. రైతు రుణాలను మాఫీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారు. అయితే 2020, 2021 సంవత్సరాల్లో వరుసగా కరోనా రావడంతో ఆర్థిక మాంధ్యం తలెత్తింది. ఇక బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు చేయడం.. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్ఎంబీ నిధుల విడుదలలో జాప్యం.. కోత విధించింది. దీంతో ఆర్థిక సమస్యలు ఏర్పడడంతో పాటు 2018 ఎన్నికల్లో ఇచ్చిన పథకాలు కొనసాగించడం, కొత్త పథకాల అమలుతో ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరిగింది. ఇలా ఎన్ని ఆటంకాలు వచ్చినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను మాత్రం అమలు చేస్తూనే వచ్చింది. ఇటీవలే ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుండటంతో రైతులందరికీ రుణమాఫీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రక్రియ ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేశారు. రైతుబంధు తరహాలో రుణమాఫీ ప్రక్రియ అమలు కానున్నది. వచ్చే 45 రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం నాటికి పూర్తి కానున్నది. దీనివల్ల రూ.లక్షలోపు అప్పు తీసుకున్న రైతులందరికీ ఊరట కలగనున్నది. రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది.
జిల్లాలో 2014లో 1,44,540 మంది రైతులకు రూ.622 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇక 2018లో మొదటి విడుతలో 8,553 మంది రైతులకు రూ.13.1 కోట్ల రుణమాఫీ అమలు కాగా రెండో విడుతలో 10,243 మందికి రూ.33.61 కోట్ల రుణమాఫీ అమలైంది. ఇలా 2018 తర్వాత 18,796 మంది రైతులకు రూ.46.71 కోట్ల రుణమాఫీ అయ్యింది. 2014లో 1,44,540 మంది రైతులు, 2018లో 18,796 మంది రైతులతో కలిపి ఇప్పటి వరకు 1,63,336 మంది రైతులకు ప్రభుత్వం రూ.669.61 కోట్లను రుణమాఫీగా జిల్లాకు మంజూరు చేసింది. ఇదిలా ఉంటే జిల్లాలో 2018 తర్వాత మొత్తం 1,75,458 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 18,796 మందికి అమలైంది. ఇంకా 1,56,662 మంది కర్షకులకు ఈసారి రూ.720 కోట్ల మేర రుణమాఫీ చేయనున్నట్లుగా సమాచారం.
నేటి నుంచి రుణమాఫీ : సీఎం కేసీఆర్ ఆదేశంతో గురువారం నుంచి రుణమాఫీ అమలు కానున్నది. జిల్లాలో 1,75,458 మంది రైతులకుగాను రూ.25 వేలలోపు ఉన్న 18,796 మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ జరిగింది. సీఎం నిర్ణయంతో జిల్లాలో ఇంకా 1,56,662 మంది రైతులకు రూ.720 కోట్ల మేర రుణమాఫీ అమలు కానున్నది. రూ.లక్షలోపు తీసుకున్న వారందరికీ వర్తించనున్నది.
– వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్కర్నూల్
వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్న రైతుల పక్షాన నిలబడిన మహానేత సీఎం కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయంపై ఆధాపడిన రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రుణమాఫీని వెంటనే అమలు పర్చాలని వ్యవసాయశాఖకు ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ఇచ్చిన మాట ప్రకారం వారి సంక్షేమం కోసం రుణమాఫీని నేటి నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయి. రుణమాఫీని యుద్ధప్రాతిపదికన చేపట్టినందుకు మక్తల్ నియోజకవర్గ రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– చిట్టెం రామ్మోహన్రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే
పంట పెట్టుబడికి బ్యాంకులో అప్పు చేసిన. తీసుకున్న అప్పు చెల్లించడం కష్టమైంది. రైతుల కష్టాలు గుర్తించిన కేసీఆర్ సార్ రుణమాఫీ చేస్తున్నామని చెప్పడంతో సంతోషంగా ఉంది. అప్పు కట్ట లేని మాలాంటి పేద వారికి అండగా నిలిచిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. సాయం చేస్తున్న సర్కారును ఎప్పటికి మరిచిపోం.
– నిరంజనమ్మ, మహిళా రైతు, పొల్కెపహాడ్, వనపర్తి జిల్లా
రైతులకు గతంలో 50 వెల రుణమాఫి చెశారు. గురువారం నుండి రైతులకు రుణమాఫి చెస్తూ ఉత్తర్వులు జారి చెయ్యడం రైతులకు వరం, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుభీమా తో పాటు రుణమాఫి చెయ్యడం కేవలం కేసీఆర్కే చెల్లు, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.
– శ్రీధర్రెడ్డి, రైతు, అప్పంపల్లి, నారాయణ పేట జిల్లా
సీఎం కేసీఆర్ సార్తోనే రుణమాఫీ సాధ్యమైతదని మేం అనుకున్నం. ఎన్నటికైనా సర్కారు రుణమాఫీ చేస్తదనే ఆగినం. రైతుబంధుతో నాకున్న రెండున్నర ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్న. ఎరువులు, మందుల కోసం బ్యాంక్లో రూ.80వేల రుణం తీసుకున్న. రుణమాఫీ చేయడం సంతోషంగా ఉంది. రైతులకు గతంలో ఏ సర్కారు చేయనంత మేలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. సీఎం కేసీఆర్కు రైతులందరం రుణపడి ఉంటం.
– కురువ తిమ్మప్ప, రైతు, పులికల్, , జోగుళాంబ గద్వాల జిల్లా
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ రైతుబాంధవుడయ్యాడు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తున్నామని చెప్పడం ఆనందంగా ఉంది. 24 గంటల కరెంట్, రైతుబీమా, పెట్టుబడిసాయం కింద రైతుబంధు వంటి గొప్ప పథకాలు ప్రవేశపెట్టి అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. గతంలో వ్యవసాయం దండుగా అనుకున్నాం.. నేడు పండుగలా చేసుకుంటున్నాం. రైతు సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్ సారే.. నేను చారకొండ యూనియన్ బ్యాంక్లో రూ.లక్ష రుణం తీసుకున్నా. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రుణమాఫీతో నాకు మేలు జరుగుతుంది. సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
కేసీఆర్ ఎవరి అంచనాలకు అందని వ్యక్తి. మాలాంటి రైతులకు రుణమాఫీ చేయడం చాలా గొప్ప విషయం. రైతుబంధు, రైతుబీమా అందిస్తూ.. హామీ మేరకు రుణమాఫీ చేస్తాననడం సంతోషం. మాఫీ ప్రకటనపై ఎలాంటి సందేహం లేదు. ఆయన హామీ ఇచ్చాడంటే చేసేస్తారు. నాకు ఐదెకరాల పొలం ఉంది. రూ.లక్ష రుణం తీసుకున్న. ఇప్పుడు మాఫీ చేస్తే నాకు ఎంతో మేలు.
– రాంరెడ్డి, పెద్దముద్దునూరు, కందనూలు
రుణమాఫీ మొత్తం ప్రక్రియను పరిమిత కాలంలో సీఎం ఆదేశించడం సంతోషంగా ఉంది. రైతులకు ఇది పెద్ద ఉపశమనంగా చెప్పొచ్చు. రుణమాఫీతో రైతులకు వడ్డీ భారం కూడ తగ్గనుంది. రుణమాఫీతో రైతుల కష్టాలు అన్నీ తీరనున్నాయి. సీఎం కేసీఆర్కు రైతులు రుణపడి ఉంటారు. రుణమాఫీతో రైతులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారని చెప్పడంలో సందేహమే లేదు.
– ఉప్పరి పార్వతమ్మ, రైతు, గట్టు, గద్వాల జిల్లా
రైతులను రాజుగా నిలబెట్టాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కొంతకాలంగా పనికి రాని పార్టీలన్నీ రుణమాఫీపై రైతులను గందరగోళానికి గురిచేస్తున్న తరుణంలో రైతులు మరోసారి ఓడిపోకుండా నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
-మధుసూదన్రెడ్డి, నాగవరం పీఏసీసీఎస్ చైర్మన్
రైతుల సంక్షేమం కోరే ముఖ్యమంత్రి కేసీఆర్, రుణమాఫీ ప్రకటించడంతో ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మాకు దేవుడయ్యాడు. ఆయనకు మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం. నేటి నుంచి సెప్టంబర్ 2 వరకు విడుతల వారీగా రుణమాఫీ ప్రకటించడం హర్షించదగ్గ విషయం. రైతు పక్షపాతి కేసీఆర్ వెంటే మేమంతా ఉంటాం.
– నర్సింహారెడ్డి, రైతు, అప్పంపల్లి, పేట జిల్లా,
మన ముఖ్యమంత్రి అసామాన్యుడు. ఎవరూ అం దుకోని విధంగా ఆయన ఆలోచనలు ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనాత్మకంగా ఉం టుంది. ఈ ప్రకటనతో ప్రతిపక్షాల నోళ్లు మూతబడ్డాయి. నాకు 4 ఎకరాల పొలం ఉండగా లక్షా 5 వేల రుణం తీసుకున్న. రైతుబంధు వచ్చింది.. ఇప్పుడు రుణం మాఫీ అయితుంది. ఔర్ ఏక్ బార్ కేసీఆర్ సర్కార్.
– వెంకటయ్య, పెద్దముద్దునూరు, కందనూలు