నారాయణపేట, నవంబర్ 22 : బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమేనని.. సకల జనుల ఆత్మగౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని, అభ్యర్థి ఎలాంటి వాడు.. అతడి గుణగణాలు, అభ్యర్థి పార్టీ చరిత్రను తెలుసుకోవాలని సూచించా రు. నోట్ల కట్టలు.. దావత్లకు ఓటేస్తే వచ్చే ఐదేండ్ల వరకు గోస పడాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్తో 58 ఏండ్లపాటు ఇబ్బందులు పడ్డామని.. కరువు, ఆకలి చావులు, బతుకుదెరువు కోసం వలసలు, తాగునీరు, రైతు ఆత్మహత్యలు వంటి ఎన్నో ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రస్తుతం తెలంగాణ బిడ్డలకు అటువంటి గోసలేదని, 24 గంటల కరెంటు, రైతుబంధుతో రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారన్నారు. పంట పెట్టుబడితోపాటు పండిన ధాన్యా న్ని కూడా ప్రభుత్వమే కొంటూ అన్నదాతకు సర్కారు అండగా నిలిచిందన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్రెడ్డి నియోజకవర్గానికి ఏమి చేశాడో ప్రజలు గమనించాలన్నారు. ఆయన హయాంలో సెగ్మెంట్ అన్ని రంగాల్లో అభివృద్ధికి దూరంగా ఉందని..
ఎలాంటి సమస్యను పరిష్కరించలేదన్నా రు. ఫాల్తు మాటలు, నీతిలేని రాజకీయాలతో ప్రజలను మోసం చేయడమే ఆయనకు తెలుసన్నారు. 2018లో పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటిన నుంచే కొడంగల్లో ప్రగతి పరుగులు తీస్తున్నదన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన సెగ్మెంట్ అభివృద్ధికి పట్నం నరేందర్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని …వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చి నియోజకవర్గ రూపురేఖలను మార్చారన్నారు. రేవంత్రెడ్డి నియోకజవర్గానికి రూపాయి పని కూడా చేయలేదన్నారు. 30రోజులు మురిపించే కాం గ్రెస్ కావాలా.. ఏడాదిలో 365 రోజులు అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడే నరేందర్రెడ్డి కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా గెలవనోడు.. సీఎం అవుతాడంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ప్రశ్నించారు. కాంగ్రెస్లో ఉన్న నాయకులంతా సీఎం అభ్యర్థులేనని వారిలో వారికే క్లారిటీ లేనప్పడు, ఇక్కడ పోటీ చేసే రేవంత్ ఏవిధంగా సీఎం అవుతాడో ప్రజలే గుర్తించాలన్నారు. కాంగ్రెస్కు 20 సీట్లు కూడా రావు.. అటువంటిది ఓట్లను రాబట్టుకునేందుకు ప్రజలను మోసం చేస్తూ.. సీఎం అం టూ చెప్పుకొంటున్నట్లు ఆరోపించారు. కొడంగల్లో గెలవనోడు కామారెడ్డి లో పోటీ చేస్తుండని, అక్కడి ప్రజలు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్న డబ్బు సంచులతో కొడంగల్లో బీఆర్ఎస్ నాయకులను కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఉత్తగ్యాసేనని వాటితో ఒరిగేదేమీ లేదనేది కర్ణాటక ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. కర్ణాటకలో ఇదే మాదిరి గా 5 గ్యారెంటీలు ప్రకటించారు. నేడు అక్కడ ఏ ఒక్కటీ అమలు కాకపోవడం తో ఎందుకు గెలిపించామా అని అక్కడి ప్రజలు బాధ పడుతున్నట్లు తెలిపారు. ఈ మధ్యే కర్ణాటక రైతులు కొడంగల్కు వచ్చి వారి గోసను తెలిపి.. కాంగ్రెస్ను గెలిపించొద్దని సూచించారన్నారు. తెలంగాణ బిడ్డలు అటువంటి తప్పు చేయకుండా అభ్యర్థిని, పార్టీ సిద్ధాంతాల ను చూసి ఓటేసి అభివృద్ధిని ప్రోత్సహించాలన్నారు. ధరణిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ అంటున్నదని.. ధరణి లేకుంటే రైతుల బతుకులు ఆగం అవుతాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ ఆంధ్ర నా యకులతో కలిసి ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టారని మండిపడ్డారు. ఇటువంటి ధోకేబాజ్ కాంగ్రెస్ పార్టీని, నీతిలేని రాజకీయాలకు పాల్ప డే వారిని తెలంగాణ నుంచి తరిమికొడదామన్నారు. నరేందర్రెడ్డిని గెలిపిస్తే.. తప్పక ప్రమోషన్ రావడం ఖాయన్నారు. నరేందర్రెడ్డిని మరోసారి గెలిపిస్తే డిగ్రీ, ఇంజినీరింగ్, బీఎస్సీ నర్సింగ్ కళాశాలలను తప్పకుండా మంజూరు చేయించే బాధ్యత తనదని.. కోరినన్ని నిధులను మంజూ రు చేస్తానన్నారు. నరేందర్రెడ్డి గెలిచిన తర్వాత ఓ రోజు కొడంగల్ ప్రజల మధ్యనే ఉంటానని హామీ ఇచ్చారు. ఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించి కొ డంగల్ పొలాలకు కృష్ణా నీటిని అందిస్తామ న్నారు. సెగ్మెంట్లోని లక్షా49 వేల ఎకరాలకు సాగునీరందుతుందని.. దాంతో కొడంగల్ సస్యశ్యామ లం అవుతుందన్నారు. అందువల్ల ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడే నరేందర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరా వు, మం త్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, గ్రేటర్ మా జీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్, ఎన్నికల మండల ఇన్చార్జిలు, నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కొడంగల్/బొంరాస్పేట : కోస్గి పట్టణంలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపింది. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు ఆటోలు, లారీలు, బైక్లు, ప్రత్యేక వాహనాల్లో భారీగా తరలివచ్చారు. కొడంగల్ నుంచి కోస్గి పట్టణంలోని సభాప్రాంగణానికి చేరుకునే మహబూబ్నగర్-చించోళి 167 హైవే రోడ్డుపై వాహనాలు బారులుదీరాయి. జై కేసీఆర్, జై నరేందరన్నా, జైజై బీఆర్ఎస్, కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు హోరెత్తాయి. కొడంగల్ నుంచి కోస్గి రహదారి మొత్తం గులాబీ మయంగా మారింది. సీఎం సభగా సక్సెస్ఫుల్గా జరిగింది. కాగా బొంరాస్పేట మండలంలోని నాందార్పూర్ గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారులు సభ లో ప్రదర్శించిన ఒగ్గు కళాప్రదర్శన, మహిళల బోనాలు, బతుకమ్మల ఊరేగింపు ప్రజలను ఆకట్టుకున్నది.
బొంరాస్పేట/కొడంగల్ : మరోసారి ఆశీర్వదిస్తే సైనికుడిలా పనిచేస్తానని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం కోస్గి పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఐదేండ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. ప్రజలకు నిత్యం అందుబాటు లో ఉన్నానని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని 2018 నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రూ.2 వేల కోట్లకు పైగా నిధులతో ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 25 ఏండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గురునాథ్రెడ్డి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్రెడ్డి ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టలేదని విమర్శించారు. కొడంగల్, కోస్గి పట్టణాలను మున్సిపాలిటీలుగా మార్చి రూ.100 కోట్లతో ప్రగతి పనులను చేపట్టినట్లు..కొత్తగా మూడు మండలాలను ఏర్పాటు చేయడంతోపాటు కొడంగల్కు డిగ్రీ, దౌల్తాబాద్కు జూనియర్ కళాశాలలను తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. భూగర్భ జలాల పెంపునకు 15 చెక్డ్యాంలను మంజూరు చేయించి అందులో ఆరింటిని పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు సాధ్యం కానీ హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తే చాలంటున్న రేవంత్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ టికెట్లను అమ్ముకుని..
వచ్చిన డబ్బుతో బీఆర్ఎస్ నాయకులను పీసీసీ అధ్యక్షుడు కొనేందుకు యత్నిస్తుండటంతోపాటు ఓట్లను కొల్లగొట్టేందుకు విచ్చలవిడిగా పంచుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు 30 రోజలు ఇచ్చే దావత్లకు మోసపోయి వారికి ఓటేస్తే ఐదేండ్ల వరకు మనకు గోస తప్పదనన్నారు. 2018లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్రెడ్డి మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నాడ ని ప్రశ్నించారు. రాష్ర్టాభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని.. అందువల్ల అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించి తనను మరోసారి గెలిపించాలన్నారు. కొడంగల్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొడంగల్లో టెక్స్టైల్ పార్కును లేదా ఐటీ హబ్ను నెలకొల్పాలని, బొంరాస్పేటలో జూనియర్, నర్సింగ్ కళాశాలలు, కొత్తపల్లి మండలంలో ఠాణా, జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని, బొంరాస్పేట నుంచి వికారాబాద్కు డబుల్ రోడ్డు, బావాజీ జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్కు ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బొంరాస్పేట, దౌల్తాబాద్, కొడంగల్ మండలాల అధ్యక్షులు కోట్ల యాదగిరి, చాంద్పాషా, దామోదర్రెడ్డి, మహేందర్రెడ్డి, నారాయణరెడ్డి, దేశ్యానాయక్, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, పార్టీ నాయకులు మోహన్రెడ్డి, ప్రమోద్రావు, ఇన్చార్జ్లు కిషన్రావు తదితరులు పాల్గొన్నారు.