కోస్గి, నవంబర్ 20 : ఈనెల 22న కోస్గిలో ఏర్పాటు చేసే ప్రజాఆశీర్వద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా విచేసి ప్రసంగించనున్నారని భూగర్భ, గనుల శాఖ మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం కోస్గి పట్టణంలో కేసీఆర్ సభ స్థలాన్ని ఆయన పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నాయకులకు సూచించారు. హెలిప్యాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం కోస్గిలో నిర్వహించే ప్రజాఆశీర్వద సభను విజయవంతం చేయాలని నాయకులకు సూచించారు. 50వేల మందిని తరలించేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సభ స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో స్టేట్ ఫైనస్ డైరెక్టర్ సలీం, ఈజీఏస్ స్టేట్ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు రాజేశ్, మాజీ డిప్యూటి మేయర్ బాబా ఫసియోదీన్, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీను, మాధుసూదన్ యాదవ్, నాయకులు వరప్రసాద్, వెంకట్నర్సింలు, వెంకటయ్య, రాము, సాయిలు పాల్గొన్నారు.
కొడంగల్ నియోజకర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్దతు తెలపాలని మంత్రి మహేందర్ టీడీపీ నియోజకర్గ ఇన్చార్జి సామల వెంకటప్రసాద్ను కోరారు. ఆయన స్పందించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి పార్టీలకు అతితంగా మద్దతు తెలిపి ప్రచారం చేసి కారు గుర్తకు ఓటువేస్తామని మంత్రి మహేందర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు అన్ని మండలాల ఇన్చార్జిలు తెలిపారు. ఈ సందర్భంగా భూగర్భ గనుల, జల వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మట్లాడుతూ టీడీపీ నియోజకర్గ ఇన్చార్జులు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. కొడంగల్ నియోజకర్గంలో పట్నం నరేందర్రెడ్డిని కొడంగలో గెలిపిస్తామన్నారు. మంగళవారం నుంచి ప్రచారం నిర్వహించాని వారికి సూచించారు. కార్యక్రమంలో డిప్యూటి మాజీ మేయర్ బాబా ఫసియోద్దీన్, మున్సిపల్ అధ్యక్షుడు మ్యకల రాజేశ్, కౌన్సిలర్లు బాలేశ్, మాస్టర్ శ్రీనివాస్, టీడీపీ మండల అధ్యక్షడు, మల్లేశ్, మోహన్, నారాయణ, రహిమ్, రమేశ్గుప్తా, రాజు, మహేశ్, టీడీపీ జిల్లా ఇన్చార్జి నీలం రవి పాల్గొన్నారు.