‘ఇందిరమ్మ రాజ్యం.. దరిద్రపు రాజ్యం.. రక్తపాతాలు.. ఆకలి చావులు.. మతకల్లో లాలు.. ఎన్కౌంటర్లు జరిగాయి.. వారి నిర్లక్ష్యంతోనే ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల గడ్డగా మారింది.. కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో 50 ఏండ్ల పాలనను గుర్తుకు తెచ్చుకోవాలె.. అలాంటి నేతలు మళ్లా అధికారంలోకి వస్తే దళారులు పుట్టుకొస్తారు.. లంచాలు పెరుగుతాయి.. అప్పుడే వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలంటారు.. 10 హెచ్పీ బోరు మోటర్లు పెట్టుకోవాలంటారు.. ధరణిని తీసి బంగాళా ఖాతంలో వేస్తామంటారు.. అలాంటి పార్టీని గెలిపిస్తే మళ్లా ఆగమాగమైతం.. మనకు అన్యాయం చేసిన హస్తం, బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలె.. మంచిగా నడుస్తున్న తెలంగాణను కాపాడుకోవాలె.. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం’.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్, కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
త్వరలో జరగబోయే ఎలక్షన్లలో ఎవరిని గెలిపించాలో ఆలోచన చేయాలె.. గ్రామాల్లోకి వెళ్లాక ప్రజల మధ్య చర్చ జరగాలె.. రాయేదో, రత్నమేదో, మం చేదో, చెడేదో గుర్తు పట్టాలె.. కుండను కొనాలంటే కూడా కొట్టి చూస్తాం.. కూరగాయలు కొంటే పుచ్చులు ఏరి మంచిదే కొంటాం.. మరి ఎమ్మెల్యేను ఎన్ను కునేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలె.. బీఆర్ఎస్ అభ్యర్థులు, మిగతా వారు పోటీలో నిలబడ్డారు.. వీరిలో ఎవరు గెలిస్తే ఏం చేస్తారో.. వారి ప్రవర్తన ఎలాంటిదో చూడాలె.. వారి వెనుక ఉన్న పార్టీల గురించి, వాటి చరిత్ర గురిం చి తెలుసుకోవాలె.. అప్పుడు ఓటేస్తేనే ప్రజలకు లాభం జరుగుతుంది..
మహబూబ్నగర్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రేసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నారు.. ఇందిరమ్మ రాజ్యం ఏట్ల ఉండేదో మనకు తెల్వదా.. ఆకలిచావులే కదా.. నక్సలైట్ల ఉద్యమాలే గదా.. ప్రజలను కాల్చిచంపుడాలే కదా.. ఎన్కౌంటర్లే కదా.. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీరామారావు పార్టీ ఎం దుకు పెడ్తుండే.. ఏం అక్కరుండే.. అని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రపు రాజ్యం మరొకటి లేదని ద్వజమెత్తారు. ఆదివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పార్టీ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. అలంపూర్, కొల్లాపూర్, నాగర్కర్నూలు, కల్వకుర్తిలో నిర్వహించిన ప్రజాఆశీర్వద సభల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో సగం కడుపుకే తినోటోళ్లు.. రైతులు, ప్రజలు మంచిగా ఉంటే రెండు రుపాయలకు కిలో బియ్యం ఇయ్యాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రాచి రంపాన పెట్టిండ్రు, దోపిడీ చేసిండ్రు.. ప్రజలకు పట్టించుకోలే.. వారి కర్మన వారిని వదిలేసిండ్రని ఆరోపించారు. అందుకే పార్టీలు, అభ్యర్థుల చరిత్రలను తెలుసుకొని ఓటేయ్యాలని కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ మీ కండ్లముందే పుట్టిం ది.. తెలంగాణ తెచ్చింది.. మా పరిపాలన చూ స్తుండ్రు.. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పరిపాలన చేసిండ్రు.. ఏం ఒరగబెట్టింది.. ఢిల్లీలో ఉండే పార్టీలకు మన గోస పడ్తదా?
బీజేపోనికి తెలంగాణ గురించి ఏమన్నా వాళ్లకు పడ్తదా?.. అందుకే గ్రామాల్లో పార్టీల చరిత్రలు చూసి ఓటును సక్రమంగా వినియెగించాలని కోరారు. ఎన్నికలు వచ్చాక ఆ పార్టీ ఈ పార్టీ నుంచి నిలబడ్తరు.. నిలబడ్డ అభ్యర్థుల గుణగణాలు, పార్టీల చరిత్రను గుర్తుపెట్టుకొని ఓటేయాలన్నారు. రాయిదో రత్నమేదో గుర్తుపట్టి మనం ఎవరికి ఓటు వేస్తమో అనేది ఆలోచించి ఓటేయ్యాలి. 2004 నుంచి మొదలు పేడ్తే 2014 దాకా తెలంగాణ ఇయ్యలే.. ఎంతోమంది కాల్చి చంపిగాని మన తెలంగాణ మనకు ఇవ్వలే.. తెలంగాణను ఆనాడు అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయే.. సిటీ కాలేజీలో ఏడు మంది పిల్నల్లి చంపి, ఎంతోమందిని బలి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్కు ఉందన్నారు. మన కొల్లాపూర్లో గతి ఏముండే గుంపుమేస్త్రీలు ఉండే పెద్దకొత్తపల్లి, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలు ఏముండే బొంబాయి తోవ్వుండే.. బొంబాయి బస్సులె.. కరెక్టే గదా.. కండ్లారా చూసినం కదా.. గోల్మాల్ అవుదామా? ఎవరో ఏదో చేప్తే ఆగమైదామా? అని ఓటర్లను కోరారు. గుంపుమేస్త్రీలు, ముంబాయి బస్సులకు ఆలవాలంగా ఉండే మహబూబ్నగర్లో సిగ్గు లేకుండా గంజికేంద్రాలు పెట్టిండ్రని అన్నారు. మనం బిచ్చగాళ్లమన్నట్లు గంజి కేంద్రాలు పెట్టిండ్రు.. ఇందిరమ్మ రాజ్యంలో పెట్టిన పేరేంది.. వెనుకబడిన ప్రాం తం.. గరీబ్ ప్రాంతం.. మీరు జొన్నలే పండించుకోవాలే.. వడ్లు పండయ్ అని మాట్లాడిండ్రన్నారు. మొన్నటి వరకు కూడా ఇదే మాటమాట్లాడిండ్రు కదా.. నెలకింద కూడా మాట్లాడ్రిండ్రు కదా.. నీళ్లు రావు, మీకు వడ్లు పండయ్ మీకు తెలివిలేదని కూడా మాట్లాడ్రిండ్రన్నారు.
కొల్లాపూర్లోనే లక్షా 50 వేల ఎకరాలు వరి పండిస్తున్నారు.. ఇది ఏడికెళ్లి వచ్చింది? మన డాంబర్ రోడ్లన్నీ వడ్లతోనే నిండినయ్.. హెలికాప్టర్లో ప్రచారానికి తిరుగుతుంటే ఏ రోడ్డు చూసినా ఏ ఊరు చూసినా దాన్యపు రాశులే కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ వచ్చినంక ఈవడ్ల రాశులన్నీ ఏడికెళ్లి వచ్చిన య్…ఎవరు తెచ్చిండ్రు.. అంటే అర్థం చేసుకోవాలే మనం ఎంత మోసపోయినమో.. ఎంత దగా పడ్డపడ్డామో గుర్తించుకోవాలని చెప్పారు. తెలంగాణను సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ.. తాగునీళ్లు ఎట్లుండే కొల్లాపూర్లో పక్కనే కృష్ణా నది ఉంటది తాగేనీళ్లు కూడా ఇయ్యలేదన్నారు. కాంగ్రెసోళ్లకు ఓట్లడగటానికి సిగ్గు శరం ఉండాలే.. ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారన్నారని ధ్వజమెత్తారు. ఎంతమంది ముఖ్యమంత్రులు అయిండ్రు.. కనీసం మంచినీళ్లి ఇచ్చిండ్రా.. కరెంట్ ఇచ్చిండ్రా.. రెండు వేల పింఛన్ ఇచ్చిండ్రా, పేద సాదలను ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. మరి ఏం చేసినట్లు.. ఇందిరమ్మ రాజ్యం.. తోక రాజ్యం.. వీటికి మీరు గోల్మాల్ కావొద్దని వివరించారు. కొల్లాపూర్కు ఇందిరమ్మ మనవడు రాహుల్గాంధీ వచ్చిండని.. ఎందుకు వచ్చిండు గడ్డి కొయ్యనికే వచ్చిండా? ముళ్ల కిరీటం పెట్టనింకే వచ్చిండా.. మళ్లా కరెంట్ బంద్ పెట్టి ఆగమాగం చేయనికే వచ్చిండా? అని ప్రశ్నించారు. ఈ ఓట్లు బతుకు దెరువు పోరాటం.. మన తలరాతను మార్చే ఓట్లని అన్నారు. ఆషామాషిగా ఓట్లేస్తే ఆగం ఆగం అవుతామన్నారు. పోలీసులకు పట్టిచ్చుడు.. కేసులు పెట్టిచ్చుడు ఇవి కాంగ్రెస్ అభ్యర్థి పని..
హర్షవర్ధన్రెడ్డి ఎం పనిచేసిండు ఇంతకుముం దు ఉన్నాయన ఏం పని చేసిండు మీకు తేల్వదా అంటు ప్రశ్నించారు. ఐడేండ్లు మంత్రిగా ఉండే.. అందుకే మీరుపోమన్నలేక ఓడగొట్టిండ్రని అన్నారు. ఇప్పుడు కొత్త వేషం వేసుకొని మళ్లా మాట్లాడతడు.. ఇంతకుముందు చేసిన తన మంచి పనులేంది.? హర్షవర్ధన్రెడ్డి ఖరాబు చేసిందేంది.. ? అందుకే ఓట్లు జాగ్రత్తగా చూసి వేయాలన్నారు. ఈ తొమ్మిదేండ్లలో ఎంత కష్టపడ్డామో, నీళ్లు తెచ్చేందుకు ఎంత బాధపడ్డామో మీకు తెల్వనిది కాదన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడులకు పెండింగ్ ప్రాజెక్టులని పేరు పెట్టిండ్రు.. మరి తెలంగాణ వచ్చినంక మూడేండ్లలో పూర్తి చేసి నీళ్లు దుంకించినం.. ఇప్పుడేట్ల తెచ్చినం.. మంత్రమేసినమా? మాయ చేసినమా? కష్టం చేస్తే మా ప్రజలకు నీళ్లు గావాలే అనే కోరిక ఉంటే ఇయ్యాల నీళ్లు వచ్చినయ్ అన్నారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించినం.. పాత మహబూబ్నగర్ జిల్లాకు మొత్తం 20లక్షల ఎకరాలకు నీరు పారుత్తది.. బంగారు తునక అయితదన్నారు. నేను రెండు పాలమూర్లను చూసినం…ఉద్యమ సమయంలో ఇక్కడి బాధలు చూసి ఇక్కడినుంచే ఎంపీగా పోటిచేసిన.. ఎంపీగా ఉంటూనే తెలంగాణ సాధించిన అని గుర్తు చేశారు. ఇది జీవన్మరణ సమస్య.. మీరంత ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కాగా కేసీఆర్ అనుకున్న సమయానికి రావడంతో అన్ని సభలకు జనం పోటేత్తారు. కేసీఆర్ వచ్చాకా కూడా జనం తండోపతండలుగా తరలిరావడం కనిపించింది. నాలుగుచోట్ల నిర్వహించిన ప్రజాఆశీర్వద సభలు విజయవంతం అయ్యాయి.