సర్కారు సబ్బండ వర్గాలకు ప్రోత్సాహం అందిస్తుండడంతో సంబురం నెలకొన్నది. సీఎం కేసీఆర్ గొర్రెల యూనిట్లతో గొల్లకురుమల్లో దరహాసం, రూ.లక్ష ఆర్థిక సాయంతో చేతివృత్తిదారులకు చేయూత, రూ.4,116 పింఛన్తో దివ్యాంగులకు ధీమాన్వివగా.. గూడులేని పేదలకు ప్లాట్లను పంపిణీ చేసి ‘పట్టా’భిషేకం చేశారు. దీంతో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పాలమూరులో మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో దివ్యాంగులు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వారితో కలిసి మంత్రి భోజనం చేశారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
దివ్యాంగులకు ధీమా
తెలంగాణ రాష్ట్రమొస్తే ఏమైతది అన్న ప్రతిపక్షాల మాటలకు సీఎం కేసీఆర్ దిమ్మదిరిగే సమాధానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తున్నారు. ఈక్రమంలో రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధును ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ రైతుబాంధవుడిగా మారాడు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు అందజేస్తూ అండగా నిలిచాడు. కాగా వికలాంగులకు అందజేస్తున్న రూ.3016 పింఛన్ను రూ.4,116కు పెంచుతూ సీఎం కేసీఆర్ మంచిర్యాల సభలో ప్రకటించారు. దీంతో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాకి
క్షీరాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ సార్ దేవుడితో సమానం
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నాకు దేవుడితో సమానం. నాకు ఏడేండ్ల వయస్సులో పోలియా వచ్చింది. దీంతో ఎడమ కాలు పోయి వికలాంగుడిగా మారా. ఎన్ని రకాల వైద్యం చేయించినా కాలు రాదని డాక్టర్లు చెప్పడంతో ఎంతో కుంగిపోయాను. నేను పదో తరగతి వరకు చదువుకున్నాను. కొన్ని పరిస్థితుల కారణంగా చదవడం మానేశాను. ఏదైనా ఆర్థికసాయం చేస్తే జీవనోపాధి పొందొచ్చని అప్పటి సమైక్య రాష్ట్రంలో ఎన్నోసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లభించలేదు. గ్రామంలో చిన్న కిరాణా షాపు నడపుతూ బతుకు వెళ్లదీసే వాడిని. నాకు భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3,016 పింఛన్ ఇవ్వడంతో నాకు జీవితంపై భరోసా పెరిగింది. ఈ పింఛన్తో కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాను. నా పేరున ఎకరా 30 గుంటల భూమి కూడా ఉండగా రూ.14వేల రైతుబంధు వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ సార్ రూ.వెయ్యి వికలాంగుల పింఛన్ పెంచుతున్నామని తియ్యటి మాట చెప్పడంతో నాకు చాలా ఆనందమేస్తోంది. నాలాంటి వికలాంగుల బతుకులకు ఈ ప్రకటన ఎంతో భరోసా కల్పించింది. మేము బతికున్నన్ని రోజులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– జుర్కి రవీందర్, వికలాంగుడు, రుక్కంపల్లి, నవాబ్పేట.
దయా హృదయుడు సీఎం కేసీఆర్
ఒకప్పుడు కుటుంబంతోపాటు సమాజంలోనూ అవమానాలు ఎదుర్కొని ఆత్మగౌరం చంపుకొని బతికినం. తెలంగాణ వచ్చినంక వికలాంగుల కష్టాలు ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ మేము సమాజంలో సగర్వంగా బతికేందుకు రూ.3వేల పింఛన్ ఇచ్చి మాకు గుర్తింపు తెచ్చాడు. అటువంటి పింఛన్ను రూ.4,1116 ఇవ్వడం చాలా అనందంగా ఉంది. ఈ పింఛన్తో మేం సంతోషంగా ఉంటూ మా పిల్లలను మంచిగా సదివించుకుంటున్నం. మాలాంటి కుటుంబాలకు పెద్దదిక్కుగా మారిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
అన్నలా ఆదరిస్తున్నాడు
సమాజంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్న వికలాంగులను సీఎం కేసీఆర్ చేరదీస్తున్నాడు. వారి సమస్యలు, కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి పింఛన్ పెంచాలనే నిర్ణయం తీసుకోవడం సంతోషించదగ్గ విషయం. రూ.3016నుంచి రూ.4,116కు పెంచుతున్నామని ప్రకటించడంతో చాలామందికి భరోసానిచ్చింది. నాకు భర్త లేడు, పోషించే కుమారుడు లేడు. సీఎం కేసీఆర్ నన్ను అన్నలా ఆదుకుంటున్నాడు. కొత్త పింఛన్ రూ.4,116తో ధైర్యంగా బతికేస్తా.
– అన్నపూర్ణ, శాంతినగర్
సీఎం కేసీఆర్.. దేవుడు
ముఖ్యమంత్రి కేసీఆర్ నా పాలిట దేవుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వికలాంగులకు నెలకు రూ.3,016 పింఛన్ ఇచ్చి ఎంతో మేలు చేశారు. నాకు రెండు కాళ్లు లేవు. నేను ఏ కష్టమైన పని కూడా చేయలేను. ఇప్పుడు మరో రూ.వెయ్యి పింఛన్ పెంచడం వల్ల నాకు నెలకు రూ.4,116 ఇవ్వడం వల్ల దేవుడు వరమిచ్చినట్లు అయ్యింది.
– గొపన్పల్లి ఎల్లమ్మ, వికలాంగురాలు, భూత్పూర్
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం
గతంలో మాకు రూ.3,016 పింఛన్ వచ్చేది. ఇప్పుడు రూ.4,116 పెంచడం సంతోషంగా ఉంది. కేసీఆర్ సార్ చల్లగా ఉండాలి. అప్పుడిచ్చే రూ.3,016 నెలకు సరిపడక ఇబ్బందులు పడేటోళ్లం. మా బాధలు అర్థం చేసుకొని కేసీఆర్ సార్ రూ.4,116 ఇస్తామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్కు సార్ రుణపడి ఉంటాం.
– హైమావతి, ఉడిత్యాల
ధైర్యంగా బతుకుతాం
పింఛన్ రూ.4,116కు పెంచడంతో ఎవరి మీద ఆధారపడకుండా స్వతహాగా బతకగలుగుతామనే ధైర్యమొచ్చింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ వికలాంగులకు పింఛన్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం వికలాంగులను పట్టించుకోలేదు. వీటితోపాటు ఎంతో మందికి ప్రభుత్వం పలు పరికరాలను కూడా అందించింది. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– వీరేశ్కుమార్, వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు
కులవృతులకు చేయూత
నెట్వర్క్ మహబూబ్నగర్, జూన్ 10: కులవృత్తుల వారికి చేయూతనిచ్చేందుకు రూ.లక్ష సాయం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కులవృత్తి దారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.లక్ష వారి ఖాతాలో జమ చేయనున్నది. ఈక్రమంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ సల్లగుండాలే..
అంతరించిపోతున్న కులవృత్తులను మళ్లీ బతికించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.లక్ష సాయం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం సంతోషకరమైనది. ఉమ్మడి పాలనలో ఎంతో వేదనకు గురయ్యాం. మన బతుకులు మారాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేనని, పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన కల్వకుంట్ల చంద్రుడికి రుణపడి ఉంటాం. వలసల జిల్లాగా ముద్రపడిన పాలమూరును సస్యశామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ సల్లగుండాలే.. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు…
– వడ్ల వెంకటస్వామి, మదనాపురం
రూ.లక్ష ఇవ్వడం సంతోషదాయకం
బీసీ కులాల్లో చేతి వృత్తులకు చెందిన వారికి ప్రభుత్వం రూ.లక్ష ఇవ్వడం సంతోషదాయకం. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలుపరుస్తున్న తీరు బాగుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.లక్ష సాయంతో చేతి వృత్తుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.
– రాములు, చిక్కేపల్లి, పాన్గల్ మండలం
కులవృత్తుల వారికి ఎంతో మేలు
కోయిల్సాగర్లో ఇంటి వద్దే వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. ప్రభుత్వం కల్పిస్తున్న కులవృత్తుల వారికి ఆర్థికసాయం ఎంతో ఉపయోగపడుతుంది. కులవృతిపై ఆధారపడిన వారికి రూ. లక్ష అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా. వెంటనే రూ. లక్ష మంజూరు కాగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చేతుల మీదుగా చెక్కు తీసుకున్నా. నాకు చా లా సంతోషంగా ఉంది. సీఎం సార్ ఇచ్చిన రూ.లక్షతో సామగ్రి తీసుకొ చ్చి ఆర్థికంగా ఎ దుగుతాను. కులవృతులను ఆదుకున్న సీఎం కేసీఆ ర్ సార్కు, ఎమ్మె ల్యేకు రుణపడి ఉంటా.
చేతివృత్తులకు ప్రోత్సాహం
గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారంలోకి వచ్చాక మమ్మల్ని మర్చిపోయేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధి కోసం చేతివృత్తుల వారికి ఉచితంగా రూ.లక్ష ఇవ్వడం గర్వంగా ఉంది. నైపుణ్యం కల్గిన వారికి రూ.లక్ష అందజేయడంతో వారు పలు షాపులు ఏర్పాటు చేసికోని ధైర్యంగా జీవిస్తారు. పథకాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
ఆర్థిక పరిపుష్టి
గొల్లకురుమలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదివరకే మొ దటి విడుత గొర్రెల యూనిట్లను పంపిణీ చే యగా.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెం డో విడుత పంపిణీకి శ్రీకారం చుట్టా రు. ఆయా జిల్లాల్లో అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయగా మం త్రులు, ఎమ్మెల్యేలు జీవాలను పంపిణీ చేస్తుండగా.. గొల్లకురుమలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, జూన్ 10
21 గొర్రెలిచ్చారు..
తెలంగాణ ప్రభుత్వం గొర్రెల కాపరులకు ప్రతి ఏటా సబ్సిడీ కింద గొర్రెలు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. మాకు ఇప్పుడు 21 గొర్రెలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ సార్ గొర్రెకాపరులకు ఆర్థికంగా చేయూతనివ్వడం హర్షణీయం. 10 పెద్ద గొర్రెలు, 11 చిన్న గొర్రెపిల్లలను ఇచ్చారు.
– చెన్నయ్య, గొర్రెలకాపరి, బాలానగర్
యాదవులకు సర్కారు పెద్దపీట
సీఎం కేసీఆర్ సార్ యాదవ కులస్తులకు పెద్దపీట వేశారు. గొల్ల కురుమలను గుర్తించి జీవనోపాధి కోసం గొర్రెలను సబ్సిడీపై ఇవ్వడం వల్ల జీవనోపాధి పొందుతున్నాం. మొదటి విడుతలో ఎంగంపల్లి గ్రామంలో 30 మందికి గొర్రెలు పంపిణీ చేశారు. రెండో విడుతలో నాకు మంజూరు చేశారు. చాలా సంతోషంగా ఉంది.
– జల్లెల మల్లయ్య, గొర్రెల కాపరి, ఎంగంపల్లి గ్రామం, తాడూరు మండలం
జీవనోపాధి మెరుగుపడింది
కుల వృత్తులపై ఆధారపడిన వారికి జీవనోపాధి కలిగించేందుకు పోత్సహించడం సంతోషంగా ఉంది. గొర్రెల పంపిణీతో మేము ఆర్థికంగా నిలదిక్కుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలతోపాటు సొంతంగా మరికొన్ని జీవాలను సమకూర్చుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. సీఎం కేసీఆర్ సార్ ప్రభుత్వం వచ్చిన తరువాత మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ పనులను చేపట్టడంతో వేసవిలోనూ చెరువుల్లో నీరు నిల్వ ఉండడంతో జీవాలకు సాగునీటి కొరత తీరింది. రైతులు కూడా రెండు కార్ల పంటలు పండించడం వల్ల భూమి పచ్చబడి గడ్డి అందుబాటులో ఉంటుంది.
– క్యాతం మల్లయ్య యాదవ్, గొర్రెలకాపరి, వీపనగండ్ల
అన్ని వర్గాలకు అండ
కేసీఆర్ సర్కారు అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నది. గత పాలకులు యాదవులను పట్టించుకున్న పాపాన పోలేదు. నీళ్లు లేక జీవాలతో నెలల తరబడి వలసలు పోయేటోళ్లం. సాగునీరు వచ్చినాక రైతులు, కూలీలకు ఊళ్లోనే చేతి నిండా పని దొరుకుతున్నది. గొర్రెల పథకంలో జీవాలు పొంది వాటి వల్ల వచ్చే ఆదాయంతో సంతోషంగా బతుకుతున్నాం. నాకు రెండో విడుతలో 20 గొర్రెలు, 1 పొట్టేళును ఇచ్చారు.. చాలా సంతోషంగా ఉంది. మమ్ములను ఆదుకుంటున్న కేసీఆర్ సర్కారుకు రుణపడి ఉంటాం.
– బంగారయ్య యాదవ్, గొర్రెల లబ్ధిదారుడు, పొల్కెపహాడ్
సొంతింటి కల సాకారం
ప్రభుత్వం పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. గ్రామాల్లో ఇప్పటికీ కొంతమంది గుడిసెల్లోనే జీవిస్తున్నారు. పట్టాల పంపిణీతో పల్లెల్లో గుడిసెల స్థానంలో స్లాబ్ ఇండ్లు కనిపిస్తాయి. పట్టాల పంపిణీ అనంతరం సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందించనుంది. దీంతో పేదల సొంతింటి కళ సాకారం కానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు.
-రంజిత్కుమార్, పెద్దదగడ
పేదలకు భరోసా
ఇంటిస్థలం పట్టాలను అందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు భరోసానిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో పేదల కుటుంబాలకు ఉచితంగా ఇంటిస్థలం పట్టాతోపాటు ఇల్లు కట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటిస్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాను. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఇంటి స్థలం పట్టాను అందించడంతో మా కుటుంబానికి నీడ కల్పించినట్లయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు
– ఉమాపతి, యాపట్ల, పెద్దకొత్తపల్లి మండలం