మక్తల్, మార్చి 21; 2024_2025 విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం మక్తల్ లో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం మక్తల్ పట్టణంలో, ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 250 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్ బాలికలవంత పాఠశాలలో 250, జిల్లా పరిషత్ బాలర ఉన్నత పాఠశాలలో 280, కేరళ పబ్లిక్ స్కూల్లో 180, బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో 160, అక్షర హైస్కూల్లో 270 మంది, ఆరు పరీక్ష కేంద్రాలలో కలిపి 1390 మంది విద్యార్థులు 10 పరీక్ష రాస్తున్నారు. పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద మక్తల్ సీఐ రామలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఆకతాయిలు అలజడి చేయకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం, ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాలు సమీపంలో 144 సెక్షన్ విదించడం జరిగిందని సీఐ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని మండల విద్యాధికారి అనిల్ గౌడ్ తెలిపారు. వేసవి కాలం నందు వల్ల పరీక్షా కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం తో పాటు, వైద్య సిబ్బందిని సైతం నియమించడం జరిగిందన్నారు. మక్తల్ కేరళ పబ్లిక్ హైస్కూల్లో బ్లైండ్ విద్యార్థి సహాయకులలో పరీక్షకు హాజరు కావడం జరిగిందని పేర్కొన్నారు. ఎవరైనా ఆకతాయిలు పరీక్ష కేంద్రాల వద్ద అలజడి చేస్తే, చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.