హన్వాడ, సెప్టెంబర్ 15 : మహబూబ్నగర్-కోస్గి-చించోలి రహదారి పనులను వేగంగా చేపట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. శుక్రవారం మండలంలోని చిన్నదర్పల్లి సమీపంలో చించోలి హైవే పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఇండ్లు, భూములు కోల్పోతు న్న హన్వాడ, నాయినోనిపల్లి, ఇబ్రహీంబాద్, చి న్నదర్పల్లి, పిల్లిగుండు, పెద్దదర్పల్లి గ్రామాల రై తులతో సమావేశం నిర్వహించి తక్షణమే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతగా చేపట్టి త్వ రగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు రూ. 180 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని తెలిపారు. పనులకు ప్రతిఒక్కరూ సహకరించాల ని కోరారు. చించోలి వరకు రహదారి రావడంతో రోడ్డుకు ఇరువైపుళౠ ఉన్న భూముల రేట్లు అ మాంతం పెరిగాయన్నారు. కులాల పేరిట ఓట్ల కోసం గ్రామాల్లోకి వస్తున్న వారితో జాగ్రతగా ఉం డాలని పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, ఎంపీపీ బాలరాజు, సింగిల్విండో వైస్చైర్మన్ కృష్ణయ్యగౌడ్, కౌన్సిలర్ లతాశ్రీ, ఎంపీడీవో ధనుంజయగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీలకు సర్కారు అండ
మహబూబ్నగర్టౌన్, సెప్టెంబర్ 15 : మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో లబ్ధిదారులకు మైనార్టీబంధు కింద వంద శాతం సబ్సిడీతో కూడిన రూ.లక్ష చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మూడు నెలల కోసం టూరిస్టులు వచ్చి పోతుంటారని, వారిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దని సూచించారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే సాధారణ కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. మైనార్టీలకు సముచిత స్థానం కల్పించామని, జిల్లాకు చెందిన వారికి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ఇసాక్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రవీంద్రనాథ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యుడు అన్వర్పాషా, నాయకులు అబ్దుల్హ, షబ్బీర్, అన్వర్హుస్సేన్, మోయిన్అలీ, శివరాజ్, ఉమర్, జావిద్బేగ్, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.