విద్యార్థులకు పొద్దుగాల పూట పస్తులకు ఇక కాలం చెల్లనున్నది. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంలో అమలుకానున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకంతో పాఠశాలల్లోని విద్యార్థులకు నిత్యం ఉదయం అల్పాహారం అందనున్నది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ పథకంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు కడుపు నిండనున్నది. మహబూబ్నగర్లో 721 బడుల్లో.. 67,529 మంది, నాగర్కర్నూల్లోని 732 బడుల్లో 75,922
మందికి, నారాయణపేటలో 496 పాఠశాలల్లో 64,414 మందికి, వనపర్తిలో 423 స్కూళ్లకుగానూ 45,283
మందికి, జోగుళాంబ గద్వాల జిల్లాలోని 461 స్కూళ్లల్లో చదివే 67,529 మంది విద్యార్థులకు ప్రయోజనం
చేకూరనున్నది. ఇప్పటికే సక్సెస్ఫుల్గా మధ్యాహ్న భోజనం కొనసాగుతున్నది. పొదుపొద్దుగాలనే
విద్యార్థుల పస్తులు తీరనుండడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ)/గద్వాల, అక్టోబర్ 5
నాగర్కర్నూల్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ)/జోగుళాంబ గద్వాల : అడకముందే అన్నీ ఇచ్చే గొప్ప మునస్సున్న ముఖ్యమంత్రి మన రాష్ర్టాన్ని పాలించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రజలు ఇప్పటికే కేసీఆర్ పరిపాలనను చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా అమలు చేయలేని విధంగా ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషియన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, కంటి వెలుగు, బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ తోఫా, రైతుబంధు, రైతుబీమా వంటి పలు పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. ఈ క్రమంలో పేదల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, సకాలంలో పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేయడం జరుగుతోంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా విజయవంతంగా అమలవుతున్నది. ఇందులో భాగంగా సన్నబియ్యం, రాగిజావ, కోడిగుడ్డు, అరటిపండ్లు అందిస్తున్నా రు. ఇక పరీక్షల సమయంలో పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో స్నాక్స్ కూడా అందిస్తున్నారు. ఇక హాస్టళ్లు, గురుకులాల్లో ఉచిత విద్య, వసతిలాంటి సౌకర్యాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా అల్పాహార పథకాన్ని తీసుకొచ్చింది.
పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధి కూలీతోపాటు ఇతర పనులకు పొద్దుగాలనే వెళ్తుంటారు. దీనివల్ల ఉదయం వేళలో చాలా మంది విద్యార్థులు అల్పాహారం తీసుకోకుండా పాఠశాలలకు వస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసే వరకూ ఆకలితోనే అలమటిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు చదువుపై తగిన శ్రద్ధ చూపించలేకపోవడంతోపాటు తలనొప్పిలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో విద్యార్థులకు అల్పాహార సమస్యను తీర్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ ప్రభుత్వమే అల్పాహారం అందించేందుకు నిర్ణయించింది.
ఈ పథకంలో భాగంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉదయం పూట ఉప్మా, పొంగలి, మిల్లెట్లులాంటి అల్పాహారం అందించనున్నారు. దీనిపై విద్యాశాఖ రూపొందించిన మెనూ పాఠశాలలకు చేరింది. దీనివల్ల గ్రామాల నుంచి మండలాలు, పట్టణాలకు వెళ్లే విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది. కాలినడకన బస్టాండ్లు, పాఠశాలలకు చేరుకునే విద్యార్థులకు అల్పాహారం మంచి ఆరోగ్యాన్ని అందించనుంది. ఈనెల 24వ తేదీ నుంచి అల్పాహార పథకం ప్రతి పాఠశాలలో అమలు కానున్నది. అయితే అప్పటి వరకు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈనెల 6వ తేదీన లాంఛనంగా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విద్యాశాఖకు ఆదేశించడంతో నియోజకవర్గంలో ఒక్కో పాఠశాలను ఎంపిక చేసి ఈ పథకాన్ని ఎమ్మెల్యేల చేతుల మీదుగా లాంఛనంగా ఆరంభించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
ప్రారంభోత్సవంలో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనేలా అధికారులు ఇప్పటికే ఆహ్వానాలు అందించారు. జోగుళాంబ గద్వాల నియోజకరవ్గంలోని వీరాపురం, అలంపూర్ నియోజకవర్గంలోని ధర్మారం పాఠశాలలో అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. పాఠశాల సమయానికి 45 నిమిషాల ముందు విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. ఈ పథకం వల్ల ఉమ్మడి పాలమూరులో 2,800 ప్రభుత్వ పాఠశాలల్లోని దాదాపుగా 3లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. మహబూబ్నగర్ జిల్లాలోని 721పాఠశాలల్లోని 67,529మంది విద్యార్థులకు, నాగర్కర్నూల్లోని 732 పాఠశాలల్లోని 75,922 మందికి, నారాయణపేటలో 496 పాఠశాలల్లోని 64,414 మందికి, వనపర్తిలోని 423పాఠశాలల్లోని 45,283 మందికి, జోగుళాంబ గద్వాలలోని 461 పాఠశాలల్లో చదివే 67,529 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది.
ప్రభుత్వం ఇప్పటికే నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. గ్రామీణ ప్రాం తాల నుంచి వచ్చే వి ద్యార్థులు చాలా మంది టిఫిన్ చేయకుం డా పాఠశాలల కు వస్తున్నారు. ముఖ్యమంత్రి అల్పాహార ప థకం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడం వీరందరికి కడు పు నింపినట్లవుతుంది. పేద విద్యార్థులకు ఈ పథకం వరంలాంటిది.
– ప్రవళిక, విద్యార్థిని,
రెండు పాఠశాలల్లో ప్రారంభిస్తున్నాం..ప్రభుత్వం పేద విద్యార్థుల ఆకలి తీర్చడానికి ముఖ్యమంత్రి అల్పాహార కార్యక్రమం పథకాన్ని ప్రారంభిస్తున్నది. జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో రెండు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు చేకూరనున్నది. ఈ పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నది.
– సిరాజుద్దీన్, డీఈవో, జోగుళాంబ గద్వాల
సీఎం అల్పాహార పథకాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంజయ్నగర్, పెంట్లవెల్లి మండలంలోని కొండూరు, వెల్దండ ప్రాథమి క పాఠశాల, అచ్చంపేట బాలికల ఉన్నత పా ఠశాలల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలచే లాంఛనంగా ప్రారంభించేందుకు చర్య లు తీసుకుంటున్నాం. ఈ పథకం వల్ల ఉద యం పూట విద్యార్థులకు టిఫిన్ అందించ డం జరుగుతుంది. ఇప్పటికే మధ్యాహ్న భో జనం అమలవుతున్నది. దీనికి అల్పాహారం తోడుకావడంతో విద్యార్థుల గైర్హాజరు తగ్గడంతోపాటు ఉత్తీర్ణత పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది.