భూత్పూర్, నవంబర్ 22: పాఠశాలస్థాయిలో విద్యార్థుల ప్రతిభ గుర్తించేందుకే చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎంఈవో నాగయ్య తెలిపారు. మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు చెక్ముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. మండలంలోని 11 ఉన్నత పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారని, ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసినట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతి భ కనబర్చిన విద్యార్థులు డిసెంబర్10న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికచేస్తారని తెలిపారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలో పోటీ పరీక్షల్లో పాల్గొంటే భవిష్యత్లో పోటీ పరీలపై భయం ఉండదని తెలిపారు. కార్యక్రమంలో జెవీవీ జిల్లా ఇన్చార్జి అజయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలో..
పాలమూరు, నవంబర్ 22: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని పోలీస్లైన్ పాఠశాలలో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఈవో జయశ్రీ హాజరై ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. అలాగే గాంధీరోడ్ పాఠశాలలో హెచ్ఎం అబ్దుల్బ్ ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు అశోక్గౌడ్, వేణుగోపాలశర్మ, వెంకస్వామి, ఇన్చార్జులు, శ్రీనివాస్రెడ్డి, మల్లయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, నవంబర్ 22: మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండలస్థాయి సైన్స్ చెకుముకి పోటీల్లో మల్కాపూర్ ఉన్నత పాఠశాల, వీరభద్ర పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తెలుగు, ఆంగ్లం రెండు భాగాలుగా నిర్వహించిన పోటీలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎంలు కురుమూర్తి, వెంకట్జీ, పరీక్ష నిర్వాహకులు మొగులయ్య, రవిబాబు, వీరభద్ర పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, నవంబర్ 22 : మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు చెకుముకి టాలెం ట్ టెస్ట్ నిర్వహించారు. జెడ్పీహెచ్ఎస్ సల్లోనిపల్లి, హన్వాడ బీసీ గురుకులం, ప్రైవేట్ పాఠశాల నుంచి శారద విద్యాలయం విద్యార్థులు ప్రథమస్థానంలో నిలిచారు. కార్యక్రమంలో ఎంఈవో రాజు, సంఘం ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్చారి, రాజశేఖర్రావు, శ్రీనివాసులు, నారాయణ, ప్రశాంతి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.