మూసాపేట(అడ్డాకులు), ఫిబ్రవరి 25 : మండల కేంద్రంతోపాటు కాటవరం, తిమ్మాయిపల్లి, శాఖాపూర్ తదితర గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్రెడ్డి ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గానికి అవసరమైన నిధు లు ప్రభుత్వం నుంచి తీసుకొస్తానని, గ్రామా ల అభివృద్ధికి సమిష్టిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగిరెడ్డి, కొండా జగదీశ్వర్, విజయ్మోహన్రెడ్డి, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, శివకుమార్, రాము లు, బుచ్చన్నగౌడ్, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్, ఫిబ్రవరి 25 : గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను అందిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షు డు యజ్ఞేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మం డలంలోని నాగిరెడ్డిపల్లిలో ఈజీఎస్ నిధులు రూ.5లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులను భూమిపూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.