మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బుధవారం వాకింగ్కు వెళ్లిన పట్నంను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేశారు. బాధ్యతాయుతమైన నేతను అక్రమంగా కేసులో ఇరికించారని కన్నెర్ర చేశారు. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమంటూ కొడంగల్ నియోజకవర్గంలో దమనకాండ జరుగుతుందన్నారు.
ఇక్కడి రైతులకు మద్దతిచ్చిన బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని ప్రభుత్వానికి సూచించారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపించడం ఏమిటని, ఇదెక్కడి న్యాయమన్నారు. పట్నంపై పెట్టిన కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పట్నం అరెస్టును ఖండించారు. ప్రజాస్వామ్య హితంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో మెలుగుతున్నారని ఆరోపించారు.
– మహబూబ్నగర్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)