జడ్చర్ల టౌన్, నవంబర్ 10 : నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో సమగ్రాభివృద్ధి చేశానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలకు విజ్ఞపి చేశారు. శుక్రవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 1, 4వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి సకల జనులు నీరాజనం పలికారు. మహిళలు, యువకులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటికీ తిరుగుతూ కరెంటు, తాగునీటి కష్టాలు తొలగినయ్.. గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. జడ్చర్లను ఆదర్శంగా అభివృద్ధి చేశానని, మ రోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఫించన్ వస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. నెల తప్పకుండా ఫించన్ వస్తోంది బిడ్డా.. కారు గుర్తుకే ఓటు వేస్తామని ఆశీ ర్వాదించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, ఎంఐఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.