కల్వకుర్తి రూరల్, నవంబర్ 19 : కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలి. సీఎం కేసీఆర్ కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వంద, యాభై పడకల దవాఖానాలు ఏర్పాటు చేశారు. ఎంజీకెఎల్ఐ ద్వారా 80వేల ఎకరాలకు సాగునీటిని అందించి కల్వకుర్తి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మరో లక్షాఇరవైఐదువేల ఎకరాలకు సాగునీరందనున్నది.
పీఆర్ఎల్ఐ-కేఎల్ఐతో నియోజకవర్గమంతా సస్యశ్యామలం కానున్నది. కల్వకుర్తిలో ఇంజినీరింగ్ కాలేజ్, ఐటీ హబ్, ఆమనగల్లులో ఏసీపీ కార్యాలయం, ఎంవీఐ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సహకరించాలని కోరుతున్నా. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్జాల, గట్టిప్పలపల్లి, రఘుపతిపేటను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.