వనపర్తి టౌన్, ఏప్రిల్ 20 : ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. శనివారం ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్లో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అభిలాష్రావుతో కలిసి వా కర్స్తో మాట్లాడారు. ఎకో పార్కు, పశువుల సంతలో ప్రజలతో మాట్లాడి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అధికారం కోసం ఆశపడి ఉంటే అధికార పార్టీలో చేరేవాడినని, తెలంగాణ మూలాలు కలిగిన ఉ ద్యమ పార్టీలో చేరి ప్రజలకు మేలు చేయాలనుకున్నట్లు తెలిపారు. కొట్లాడి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్కు మనమంతా పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి ఇద్దామన్నారు. వనపర్తి ప్రాంతంతో తనకు ప్రత్యేకమని, పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నోసార్లు వాకింగ్ చేశానన్నారు. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి నిధులు తీసుకొచ్చి కాలేజీ రూపురేఖలు మార్చారని, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా పాటుపడతానని, ప్రజలంతా బీఆర్ఎస్కు మద్దతు తెలపాలని కోరారు. విద్యావంతులు, మేధావులు, యువకులు, మ హిళలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, నందిమల్ల అశోక్, బండారి కృష్ణ, రహీం, శ్రీను, జాత్రూనాయక్, శ్రీను తదితరులు ఉన్నారు.
వాల్మీకులకు అండగా ఉంటా..
వనపర్తి, ఏప్రిల్ 20 : వాల్మీకుల రిజ్వరేషన్ సాధన కోసం తనవంతుగా కృషి చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. శనివారం పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ సర్కారులో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెల్లప్ప కమీషన్ వేసిందని, రెండు పర్యాయాలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. న్యాయమైన డిమాండ్ కోసం ప్రశ్నించే గొంతుకనవుతానని, అండగా ఉంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. వాల్మీకుల రిజ్వరేషన్ కోసం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో వాల్మీకి నాయకులు వేణుగోపాల్, నీలస్వామి, రవికుమార్, తిరుమల్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.