మహబూబ్నగర్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి): లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచా ర హోరుతో ముందుకు సాగుతున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఎండలను సైతం లెక్కచేయకుండా గ్రా మా లు, పట్టణాల్లో ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పది రోజులే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మాటల తూటాలు పేల్చుతూ.. ఒకరిపై ఒకరు విమర్శనాస్ర్తాలు సంధిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా అభ్యర్థుల కోసం ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీ క్యాడర్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయా పార్టీల ప్రచార రథాల మైకులు గ్రామాలు, పట్నాల్లో హోరెత్తుతున్నాయి. సా మాజికవర్గాల వారీగా ఆయా పార్టీలు సమావేశాలు పెట్టి ఓటర్లను తమ వైపు మళ్లీంచేందుకు ప్రయత్నిస్తున్నా రు. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లో కారు ప్రచా రం దూసుకుపోతున్నది.
మహబూబ్నగర్లో పోటీ చే స్తున్న సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, నాగర్కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సె గ్మెంట్లలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మార్నింగ్ వాక్, రోడ్ షోలు చేస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి జి ల్లాలో రోడ్ షోలు నిర్వహించడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోగా.. బీఆర్ఎస్ నేతల్లో జోష్ నెలకొన్నది. ఎక్కడికెళ్లినా ప్రజలు ఆదరిస్తుండడంతో గులాబీ శ్రేణులు ప్రచారంలో దూకుడు పెంచాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రచార బాధ్యతలు భుజాన పెట్టుకొని అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. పాలమూరు లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న మన్నె శ్రీనివాసరెడ్డి గెలుపు బాధ్యతలను మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, అం జయ్యయాదవ్, పట్నం నరేందర్రెడ్డి, అల వెంకటేశ్వర్రెడ్డి స్వీకరించి అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
బీఆర్ఎస్ నాగర్కర్నూల్ లోక్సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలుపు బాధ్యతను మాజీ మం త్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, మాజీ ఎ మ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్యాదవ్, బీరం హర్షవర్ధన్రెడ్డి తీసుకొని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థితో కలిసి విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల సమీపిస్తుండడంతో రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారానికి శ్రీ కారం చుట్టారు. కార్యకర్తలను వెంటేసుకొని కారు గు ర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి వస్తున్న స్పందనను చూసి జాతీయ పార్టీల నే తలు హడలిపోతున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతున్నది. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం.. కరెంట్ కోతలు, కరువు, మంచినీటి సమస్యతో జనం సతమతమవుతున్నారు. కేసీఆర్ హయాంలో పదేండ్ల పాటు సుభిక్షంగా ఉన్న రైతాంగం, ఇతర వర్గాలు.. కాంగ్రెస్ హయాంలో పాత రోజులను గుర్తుకు తెచ్చుకునే పరిస్థితి నెలకొన్నది. పంటలు ఎండిపోవడం, ధాన్యం కొనుగోలు చేయకపోవడం, గ్యా రెంటీలను అమలు చేయకపోవడం వంటి అం శాలు బీఆర్ఎస్కు బాగా కలిసొస్తున్నాయి.
దీంతో క్యాడర్లో జోష్ పెంచేందుకు ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు రోడ్ షోలు నిర్వహించారు. దీంతో రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కారు జోరందుకున్నది. కేసీఆర్ రోడ్ షోలు ఊహించని విధంగా స క్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపీలు డీలా ప డ్డాయి. ప్రచారంలో కారు టాప్ గేర్లో దూసుకుపోతుండడంతో మిగతా పార్టీల అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కేసీఆర్ టూర్ గు లాబీ శ్రేణుల్లో జోష్ నింపగా.. ఇదే జోరుతో పార్లమెంట్పై గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ నేతలు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు ఎం పీ స్థానాల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శనాస్ర్తాలు సంధిస్త్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు తిట్ల పురాణాన్ని అందుకుంటున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు ఏం చేయలేదని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. 70 ఏండ్లు దేశాన్ని పాలించి ఏం చేశారని బీజేపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు తెలంగాణ అస్తిత్వాన్ని తొక్కి పెట్టేందుకు ప్ర యత్నించిన ఈ రెండు పార్టీలను భూస్థాపితం చే యాలని బీఆర్ఎస్ ప్రతి విమర్శలు చేస్తున్నది. బీఆర్ఎస్ పాలమూరు లోక్సభ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి.. కాంగ్రెస్, బీజేపీలను కడిగిపారేస్తున్నారు.
ఇటీవల పలు సమావేశాల్లో ఈ రెండు పార్టీలకు ప్రశ్నలు సంధిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కందనూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్.. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని.. దేవుడి పే రుతో ఒకరు, దేవుళ్ల మీద ఒట్లతో మరొకరు ఓట్లు అభ్యర్థిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. బలహీన వర్గాలను అణిచివేసేందుకు కుట్రలు చేస్తున్న జా తీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ.. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ఇద్దరూ లోకల్, నాన్ లోకల్ అంటూ తిట్టుకుంటున్నారు. పత్రికల్లో రాయలేని భాషతో మాట్లాడుతుండడంతో ఓటర్లు విస్తుపోతున్నారు.